టీ20 ప్రపంచకప్ లో ఆఖరి పోరాటం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్. ఉత్కంఠతో ఊపేస్తూ, క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ అందించే మెగా పోరు వచ్చేసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది.
సేమ్ టీమ్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగుతున్న ఈ తుదిపోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేేయనుంది. సేమ్ టీమ్ తో ఇండియా ఆడుతోంది. అంటే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి టీమ్ లో ప్లేస్ నిలబెట్టుకున్నారు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్
కోట్లాది ఇండియన్ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ రోజు (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన భారత్ వరుసగా రెండో సారి టైటిల్ ముద్దాడి హిస్టరీ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ అందుకోవాలని న్యూజిలాండ్ చూస్తోంది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని లక్ష మందికి పైగా ఆడియన్స్ సమక్షంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఢీ కొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన ఫస్ట్ టీమ్ గా ఇండియా నిలుస్తుంది. అలాగే కప్ దక్కించుకున్న ఫస్ట్ హోస్ట్ నేషన్ గా కూడా రికార్డు నమోదు చేస్తుంది. ఈ టీ20 ప్రపంచకప్ కు శ్రీలంకతో కలిసి ఇండియా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ టైమ్
మరోవైపు టీ20 ప్రపంచకప్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దనే లక్ష్యంతో న్యూజిలాండ్ ఉంది. ఆ టీమ్ ఇప్పటివరకూ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. టీ20, వన్డేల్లో కలిపి ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలవలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైటిల్ పోరులో ఇండియాను ఓడించి హిస్టరీ క్రియేట్ చేయాలని కివీస్ పట్టుదలతో ఉంది.
వీళ్లపైనే హోప్స్
{{/usCountry}}మరోవైపు టీ20 ప్రపంచకప్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దనే లక్ష్యంతో న్యూజిలాండ్ ఉంది. ఆ టీమ్ ఇప్పటివరకూ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. టీ20, వన్డేల్లో కలిపి ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలవలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైటిల్ పోరులో ఇండియాను ఓడించి హిస్టరీ క్రియేట్ చేయాలని కివీస్ పట్టుదలతో ఉంది.
వీళ్లపైనే హోప్స్
{{/usCountry}}న్యూజిలాండ్ తో ఫైనల్లో ఇండియా హోప్స్ మొత్తం సంజు శాంసన్, బుమ్రా పైనే ఉన్నాయి. ఈ టీ20 ప్రపంచకప్ లో లేటుగా టీమ్ లోకి వచ్చినా శాంసన్ బ్యాట్ తో అదరగొడుతున్నాడు. టీమ్ ఫైనల్ చేరడంలో అతనిదే కీలక పాత్ర. మరోవైపు బంతితో బుమ్రా నిలకడగా సత్తాచాటుతున్నాడు. ఎంతో ప్రెషర్ లో సెమీస్ లో ఇంగ్లాండ్ పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ఇలా ఫైనల్
చాలా ఉత్కంఠగా సాగిన సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఇండియా గెలిచింది. మరో సెమీస్ లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. కివీస్ టీమ్ లో ఓపెనర్లు అలెన్, సీఫర్ట్ డేంజరస్ గా మారారు. వీళ్లను వీలైనంత త్వరగా ఔట్ చేస్తే ఇండియన్ విజయ అవకాశాలు బెటర్ గా మారుతాయి.