Car discounts : టాటా ఈవీలపై బంపర్ ఆఫర్స్- కర్వ్ నుంచి హారియర్ వరకు.. భారీ డిస్కౌంట్లు!
Discounts on Electric cars : ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జులై నెల పొడవునా తన పాపులర్ ఈవీ మోడళ్లు అయిన కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, నెక్సాన్ ఈవీలపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో భారీ ప్రయోజనాలను ప్రకటించింది. ఆ వివరాలు..
భారతదేశ లీడింగ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టాటా మోటార్స్' ఈ జులై 2026లో సరికొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. పర్యావరణ హితమైన ఈవీ కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకు హారియర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి ఫ్లాగ్షిప్ మోడళ్లపై కంపెనీ భారీ ప్రయోజనాలను అందిస్తోంది. మోడల్, వేరియంట్ను బట్టి కొనుగోలుదారులు గ్రీన్ బోనస్ (నగదు తగ్గింపులు), ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్ల రూపంలో ఈ డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు స్టాక్ లభ్యతను బట్టి నగరాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి కచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్షిప్ను సంప్రదించాల్సి ఉంటుంది.

వివిధ టాటా ఈవీ మోడళ్లపై లభిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
టాటా పంచ్ ఈవీ - రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు!
టాటా సంస్థ వద్ద ఉన్న ప్రీ-ఫేస్లిఫ్ట్ (పాత మోడల్) పంచ్ ఈవీ స్టాక్పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
దీని లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 1.45 లక్షల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ. 1.1 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ. 35,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి.
మిడ్ రేంజ్ వేరియంట్లలో బేస్ మోడల్స్ అయిన స్మార్ట్, స్మార్ట్+ మినహా మిగిలిన వాటిపై రూ. 90,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది (మొత్తం బెనిఫిట్ రూ. 1.25 లక్షలు).
ఇక ఎంట్రీ-లెవెల్ స్మార్ట్, స్మార్ట్+ వేరియంట్లపై రూ. 60,000 క్యాష్ డిస్కౌంట్తో కలిపి మొత్తం రూ. 95,000 వరకు ఆఫర్ ఉంది.
టాటా కర్వ్ ఈవీ - రూ. 3.35 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్!
గత నెల తరహాలోనే ఈ జులైలోనూ టాటా ఈవీ కార్ల లైనప్లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్గా 'కర్వ్ ఈవీ' నిలిచింది. మే 2026 లో వచ్చిన ‘సిరీస్ ఎక్స్’ అప్డేట్కు ముందు మార్కెట్లో ఉన్న వేరియంట్లపై కంపెనీ ఏకంగా రూ. 3.35 లక్షల భారీ డిస్కౌంట్ను ఇస్తోంది.
ఇందులో రూ. 3 లక్షల భారీ క్యాష్ డిస్కౌంట్, రూ. 35,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.
అయితే, పాత వేరియంట్లలోని బేస్ మోడల్ 'కర్వ్ ఈవీ క్రియేటివ్' పై రూ. 2.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది (మొత్తం ప్రయోజనం రూ. 2.85 లక్షలు).
ఇక ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ ‘కర్వ్ ఎక్స్’ వేరియంట్లపై ఎలాంటి నగదు తగ్గింపు లేదు. కేవలం రూ. 35,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 30,000 లాయల్టీ బోనస్ మాత్రమే ఉన్నాయి (మొత్తం ప్రయోజనం రూ. 65,000). కర్వ్ ఈవీ ధరల శ్రేణి రూ. 16.99 లక్షల నుంచి రూ. 19.19 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్ ఈవీ- రూ. 50,000 వరకు ఆఫర్!
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన నెక్సాన్ ఈవీ అన్ని వేరియంట్లపై ఈ నెలలో రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 35,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ఆఫర్ కలిసి ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ధరలు రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.49 లక్షల వరకు ఉన్నాయి.
టాటా హారియర్ ఈవీ - రూ. 2.75 లక్షల వరకు తగ్గింపు!
టాటా బ్రాండ్ నుంచి వచ్చిన మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'హారియర్ ఈవీ' అన్ని వేరియంట్లపై ఈ నెలలో రూ. 2.75 లక్షల వరకు గరిష్ట ప్రయోజనాలు లభిస్తున్నాయి.
ఇందులో నేరుగా ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేనప్పటికీ.. రూ. 75,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ ఆఫర్, రూ. 1 లక్ష లాయల్టీ బోనస్, రూ. 1 లక్ష ఇంటర్వెన్షన్ బెనిఫిట్ కలిసి ఉన్నాయి.
ప్రస్తుతం హారియర్ ఈవీ ప్రారంభ ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 28.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. (హోమ్ ఛార్జర్ ఖర్చులు, కాస్మెటిక్ ప్యాకేజీలు దీనికి అదనం).
టాటా టియాగో ఈవీ - రూ. 1.45 లక్షల వరకు ఆఫర్స్..
పంచ్ ఈవీ లాగే ప్రీ-ఫేస్లిఫ్ట్ టియాగో ఈవీ మోడళ్లపై కూడా టాటా క్లియరెన్స్ ఆఫర్లను ఇస్తోంది.
మిడ్-స్పెక్ ఎల్ఆర్ ఎక్స్టీ వేరియంట్పై గరిష్టంగా రూ. 1.45 లక్షల తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 70,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 ఇంటర్వెన్షన్ బెనిఫిట్ ఉన్నాయి.
హై-స్పెక్ ఎక్స్జెడ్+ ఎల్ఆర్ వేరియంట్లపై రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది కానీ ఇంటర్వెన్షన్ బెనిఫిట్ ఉండదు, దీనివల్ల మొత్తం తగ్గింపు రూ. 1.25 లక్షలుగా ఉంటుంది.
చివరగా, ప్రీ-ఫేస్లిఫ్ట్ టియాగో ఈవీ అన్ని మిడ్ రేంజ్ వేరియంట్లపై రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్తో కలిపి మొత్తం రూ. 65,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.
మరి ఈ టాటా ఎలక్ట్రిక్ కార్లలో మీరు ఏది ఎంచుకుంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


