సూపర్ స్టైలిష్ Tata Sierra ఎస్యూవీ- రూ. 11.49 లక్షల ధరతో లాంచ్..
1990వ దశకం నాటి ఐకానిక్ సియెర్రాకి టాటా మోటార్స్ మరోసారి జీవం పోసింది! ఈ మేరకు అదిరిపోయే డిజైన్, అత్యాధునిక ఫీచర్స్తో 2025 టాటా సియెర్రాను తాజాగా లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఏడాది మచ్ అవైటెడ్ కార్లలో ఒకటైన టాటా సియెర్రాను టాటా మోటార్స్ మంగళవారం లాంచ్ చేసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్ ద్వారా ఈ ఐకానిక్ ఎస్యూవీ భారతీయ మార్కెట్లోకి గ్రాండ్గా రీ-ఎంట్రీ ఇచ్చింది.

'సాంప్రదాయానికి చిహ్నం'
తొలిసారిగా 1991లో భారతీయ రోడ్లపై కనిపించిన ఈ సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో మరోసారి మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లాంచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఈవీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
"పాత సియెర్రాకు ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు దాన్ని ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా తిరిగి సృష్టించాం. ఈ కొత్త సియెర్రా బోల్డ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది. ఇది ఎంతో అర్థవంతమైన, ఐకానిక్, ప్రీమియం అనుభూతిని అందిస్తుంది," అని టాటా మోటార్స్ ఎండీ అండ్ సీఈఓ సైలేశ్ చంద్ర తెలిపారు.
ఈ టాటా సియెర్రాను ఏఆర్జీఓఎస్ ఆర్కిటెక్చర్తో రూపొందించింది టాటా మోటార్స్. ఏఆర్జీఓఎస్ అంటే.. ఆల్ టెర్రైన్ రెడీ, ఓమ్నీ ఎనర్జీ అండ్ జియోమెట్రీ స్కేలేబుల్. ఇది ఆల్-వీల్ డ్రైవ్ కంపాటబులిటీ, ఆఫ్-రోడ్ పర్ఫార్మెన్స్, డ్యూరెబులిటీకి పెంచుతుంది.
2025 టాటా సియెర్రా- కీలక ఫీచర్స్..
టాటా సియెర్రా ఎస్యూవీలో 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇదే టాటా కర్వ్లో కూడా కనిపిస్తుంది. దీని మీద టచ్ కంట్రోల్స్. ఇందులో స్నాప్డ్రాగన్ చిప్-5జీ సపోర్ట్ చేసే ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్ ఉంటుంది. దీనికి ఓటీఏ అప్డేట్స్ లభిస్తాయి.
టాటా సియెర్రాలో 3 స్క్రీన్స్ ఉంటాయి. అవి.. 12.3 ఇంచ్ ప్యాసింజర్ డిస్ప్లే, 10.5 ఇంచ్ సెంట్రల్ స్క్రీన్, ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సౌండ్ బార్తో కూడిన 12 స్పీకర్ జేబీఎల్ సెటప్, డాల్బీ అట్మోస్, 18 సౌండ్ మోడ్స్ దీని సొంతం. ఇందులో హైప్ఏఆర్ హెడ్స్ అప్ డిస్ప్లే, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్రూఫ్, మూడ్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రేర్ సన్షేడ్స్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.
2025 టాటా సియెర్రాలో 6 కలర్ ఆప్షన్స్..
టాటా సియెర్రా ఎస్యూవీని 6 రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది టాటా మోటార్స్. అవి అండమాన్ అడ్వెంచర్, బెంగాల్ రోగ్, కూర్గ్ క్లౌడ్స్, మింటల్ గ్రే, మున్నార్ మిస్ట్, ప్రెస్టీన్ వైట్.
వీటిల్లో అండమాన్ అడ్వెంచర్, బెంగాల్ రోగ్ రంగులు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
2025 టాటా సియెర్రా రియల్ వరల్డ్ సేఫ్టీ..
2025 టాటా సియెర్రాలో లెవల్ 2 ఆడాస్ ప్యాకేజ్ ఉంటుంది. అంటే, దీనికి 20కిపైగా సేఫ్టీ ఫీచర్స్ లభిస్తున్నాయి. వీటిల్లో 6 ఎయిర్బ్యాగ్లు, పిల్లల కోసం ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ టీథర్స్, 3 పాయింట్ ఈఎల్ఆర్ సీట్బెల్ట్స్ వంటివి ఉన్నాయి.
టాటా సియెర్రా ఎస్యూవీ సేఫ్టీని పరీక్షించేందుకు టాటా మోటార్స్ రెండు యూనిట్లను ఒకదానితో ఒకటి క్రాష్ చేసింది. రియల్ వరల్డ్ క్రాష్ పరిస్థితులను అనుసరిస్తూ ఈ పరీక్ష నిర్వహించింది. ఇలా చేయడం ఇదే తొలిసారి!
ఈ క్రాష్ టెస్ట్లో ప్యాసింజర్ సెల్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్రాష్ తర్వాత డోర్లు ఓపెన్ అయ్యాయి. ఫ్యూయెల్ సిస్టెమ్కి ఏం అవ్వలేదు. ఫలితంగా క్రాష్ తర్వాత మంటలు చెలరేగే అవకాశం లేదు! ప్యాసింజర్లు వేసుకున్న సీట్ బెల్ట్లు కూడా దృఢంగా ఉన్నాయి.
టాటా సియెర్రా ఎస్యూవీలో మూడు ఇంజిన్ ఆప్షన్స్..
2025 టాటా సియెర్రాలో 3 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ డైరక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్.
1.5 లీటర్ టర్బో- పెట్రోల్ ఇంజిన్కి 6 స్పీడ్ ఆటోమెటిక్/ మేన్యువల్ ట్రాన్స్మిషన్స్ కనెక్ట్ చేసి ఉంటాయి. ఇది 160 పీఎస్ పవర్ని, 255 ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది.
1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్లో 6 స్పీడ్ మేన్యువల్, 7 స్పీడ్ డీసీఏ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఈ యూనిట్ 106 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది.
ఇక 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్కి 6 స్పీడ్ మెన్యువల్/ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ కనెక్ట్ చేసి ఉంటాయి. ఇది 118 పీఎస్ పవర్, 260/280 (మేన్యువల్, ఆటోమెటిక్) ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది.
టాటా సియెర్రా ఎస్యూవీ- ధర..
2025 టాటా సియెర్రాను అత్యంత ఆకర్షణీయమైన ధరకు తీసుకొచ్చింది టాటా మోటార్స్! టాటా సియెర్రా ఇంట్రొడక్టరీ ప్రైజ్ రూ. 11.49 లక్షలు (ఎక్స్షోరూం). మహీంద్రా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్కి ప్రత్యర్థిగా వచ్చిన ఈ ఎస్యూవీ బుకింగ్స్ డిసెంబర్ 16న మొదలవుతాయి. 2026 జనవరిలో డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ చెప్పింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


