బడ్జెట్ ధరలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' ఫీచర్ ఉన్న టాప్ 5 కార్లు ఇవే!

కార్లలోని హెడ్స్​- అప్​ డిస్​ప్లే ఫీచర్​ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. చాలా మంది కస్టమర్లు ఇప్పుడు ఈ ఫీచర్​ ఉన్న వాహనాల కోసం వెతుకుతున్నారు. వీరిలో మీరు కూడా ఉంటే ఇది మీకోసమే! ఇండియాలో అఫార్డిబుల్​ ధరకు హెచ్​యూడీ ఫీచర్​ని ఇస్తున్న 5 కార్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Nov 25, 2025, 07:30:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' (హెచ్​యూడీ) ఒకటి. అయితే ఈ సాంకేతికత ఇప్పుడు సాధారణ భారతీయ ఆటోమొబైల్​ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఈ హెచ్​యూడీ ఫీచర్ వల్ల డ్రైవర్లు రోడ్డుపై దృష్టి మరల్చకుండానే కారు వేగం, మైలేజ్, నావిగేషన్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని చూడవచ్చు. కొందరు దీన్ని స్టైలిష్​గా భావించినప్పటికీ, సరైన రీతిలో కారులో అమర్చితే, డ్రైవర్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

హెచ్​యూడీ డిస్​ప్లే కారు..
హెచ్​యూడీ డిస్​ప్లే కారు..

అధిక ధరల శ్రేణిలోకి వెళ్లకుండానే ఈ సౌలభ్యాన్ని కోరుకునే కొనుగోలుదారుల కోసం ఇప్పుడు టయోటా, మారుతీ సుజుకీ వంటి ప్రముఖ సంస్థలు హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, క్రాసోవర్‌లలో కూడా ఈ హెచ్​యూడీ ఫీచర్‌తో కూడిన వేరియంట్‌లను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ హెడ్స్-అప్ డిస్‌ప్లేతో ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన టాప్ 5 కార్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాము. ఈ మోడల్స్ అన్నీ అధిక ధరల విభాగంలోకి వెళ్లకుండానే ఈ అత్యాధునిక ఫీచర్‌ను పొందుతున్నాయి.

1. మారుతీ సుజుకీ బాలెనో

వేరియంట్: బాలెనో హ్యాచ్‌బ్యాక్​కి చెందిన ఆల్ఫా వేరియంట్​ నుంచి హెడ్స్-అప్ డిస్‌ప్లే లభిస్తుంది.

ధర: దీని ధర రూ. 8.59 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

ముఖ్య ఫీచర్లు: ఈ వేరియంట్‌లో బయటి భాగంలో ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ (డేటైమ్ రన్నింగ్ లైట్లు), కొత్త అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. కారు లోపల 9-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (Arkymys సరౌండ్ సౌండ్‌తో), 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

2. టయోటా గ్లాంజా

వేరియంట్: గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌లో వీ వేరియంట్ నుంచి హెచ్​యూడీ ఫీచర్ అందుబాటులో ఉంది.

ధర: దీని ధర రూ. 8.89 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

ముఖ్య ఫీచర్లు: ఈ వేరియంట్‌లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో లెదర్ కవర్డ్​ స్టీరింగ్ వీల్ ఉంటుంది. 4.19-ఇంచ్​ కలర్ టీఎఫ్​టీ క్లస్టర్, 9- ఇంచ్​ టచ్‌స్క్రీన్, Arkamys సౌండ్ సిస్టమ్‌ వంటివి స్టీరింగ్​ వెనక ఉంటాయి.

3. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్

వేరియంట్: ఫ్రాంక్స్ క్రాసోవర్‌లో ఆల్ఫా వేరియంట్ నుంచి ఈ హెచ్​యూడీ ఫీచర్ అందుబాటులో ఉంది.

ధర: దీని ధర రూ. 10.69 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

ముఖ్య ఫీచర్లు: ఈ ట్రిమ్‌లో లెదర్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, ఆటో-ఫోల్డ్ ఓఆర్​వీఎం, క్రూయిజ్ కంట్రోల్, Arkamys సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ వంటి సదుపాయాలు అదనంగా వస్తాయి. ఆల్ఫా వేరియంట్‌లు ప్రత్యేకంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో (స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో) మాత్రమే లభిస్తాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

4. టయోటా అర్బన్ క్రూజర్ టైసర్

వేరియంట్: గ్లాంజా మాదిరిగానే, టైసర్ ఎస్‌యూవీలో కూడా వీ వేరియంట్ నుంచి హెడ్స్​ ఆప్​ డిస్​ప్లే ఫీచర్ లభిస్తుంది.

ధర: దీని ధర రూ. 10.63 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

ముఖ్య ఫీచర్లు: ఈ వేరియంట్‌లో మెషీన్డ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ రంగులు ఎంచుకునే అవకాశం ఉంటుంది. కారు లోపల లెదర్ స్టీరింగ్ వీల్, Arkamys సౌండ్ సిస్టమ్‌తో కూడిన 9-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ సౌలభ్యం కోసం క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్- టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా ఫీచర్లు అదనంగా లభిస్తాయి. టైసర్ వీ ట్రిమ్ ఫ్రాంక్స్‌లో ఉన్న 1.0-లీటర్ కే-సిరీస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

5. మారుతీ సుజుకీ బ్రెజా

వేరియంట్: బ్రెజా కాంపాక్ట్ ఎస్‌యూవీలో జెడ్​ఎక్స్​ఐ+ ట్రిమ్ నుంచి హెచ్​యూడీ ఫీచర్ యాడ్​ అవుతుంది.

ధర: దీని ధర రూ. 11.66 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

ముఖ్య ఫీచర్లు: ఈ ట్రిమ్‌లో ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫాగ్ ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపలి భాగంలో లెదర్ కవర్డ్​ స్టీరింగ్ వీల్, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, గ్లోవ్ బాక్స్ లైటింగ్ వంటి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. ఇది Arkamys సరౌండ్ సౌండ్‌తో కూడిన 9-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్, వెనుక యూఎస్బీ-సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, 360-డిగ్రీ కెమెరాను కూడా కలిగి ఉంది. బ్రెజా జెడ్​ఎక్స్​ఐ+ 1.5-లీటర్ కే-సిరీస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More