పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. గురువారం నాడు ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు భారీ దాడులకు దిగుతూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ చర్చలను కాలయాపన చేస్తోందని, అందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ వ్యాప్తంగా భారీ పేలుళ్లు సంభవించాయి.
ఇరాన్పై అమెరికా రెండో విడత క్షిపణి దాడులు
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్లోని సైనిక నిఘా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వైమానిక రక్షణ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండో విడత వైమానిక దాడులను పూర్తి చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు 49 టోమహాక్ (Tomahawk) క్షిపణులను, అత్యాధునిక యుద్ధ విమానాలను అమెరికా ఉపయోగించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. టెహ్రాన్కు 40 మైళ్ల దూరంలో ఉన్న స్థావరాలతో పాటు పర్షియన్ గల్ఫ్ నైరుతి తీరప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ట్రంప్ ఈ కఠిన చర్యలకు ఆదేశించారు. "మేము వారిపై చాలా తీవ్రంగా దాడులు చేయబోతున్నాం" అని ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుండి స్పష్టం చేశారు.
యూఎస్ స్థావరాలపై ఇరాన్ ప్రతీకారం
అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గల్ఫ్ దేశాలలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. రెండు విడతలుగా జరిగిన ఈ ఆపరేషన్లో కువైట్లోని అలీ అల్-సలేం, అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్లతో పాటు బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్లోని 18 కీలక యూఎస్ లక్ష్యాలను తాము పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అంతేకాకుండా జోర్డాన్లో ఒక అమెరికా జెట్ను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ దాడుల్లో తమ యుద్ధనౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ కొట్టిపారేసింది.
గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్.. వాయుమార్గం మూసివేత
ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో తీవ్ర కలకలం రేగింది. బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ దేశంలో అత్యవసర సైరన్లను మోగించి, పౌరులందరూ ఆందోళన చెందకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. మరోవైపు కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దేశ వాయుమార్గాన్ని (Airspace) పూర్తిగా మూసివేసి, విమానాలను ఇతర సురక్షిత విమానాశ్రయాలకు మళ్లించింది. ఇరాన్ జరుపుతున్న దురాక్రమణల కారణంగా పౌర విమానయాన భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ వెల్లడించింది.
హార్ముజ్ జలసంధి బంద్.. ట్రంప్ వెనక్కి తగ్గేదేలే
{{/usCountry}}ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో తీవ్ర కలకలం రేగింది. బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ దేశంలో అత్యవసర సైరన్లను మోగించి, పౌరులందరూ ఆందోళన చెందకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. మరోవైపు కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దేశ వాయుమార్గాన్ని (Airspace) పూర్తిగా మూసివేసి, విమానాలను ఇతర సురక్షిత విమానాశ్రయాలకు మళ్లించింది. ఇరాన్ జరుపుతున్న దురాక్రమణల కారణంగా పౌర విమానయాన భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ వెల్లడించింది.
హార్ముజ్ జలసంధి బంద్.. ట్రంప్ వెనక్కి తగ్గేదేలే
{{/usCountry}}ఈ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని చమురు ట్యాంకర్లతో సహా అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు తక్షణమే మూసివేస్తున్నట్లు ఇరాన్ (IRGC) ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ఏ నౌక ప్రయాణించినా దానిని కూల్చివేస్తామని హెచ్చరించింది. అయితే, వాణిజ్య నౌకల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని CENTCOM తెలిపింది.
ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరంగా ఉల్లంఘనకు గురైన కాల్పుల విరమణ అని ట్రంప్ అభివర్ణించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ, ఇరాన్ చర్చల పేరుతో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోందని, ట్రంప్ ఆశించినట్లుగా ఒప్పందం కుదరకపోతే ఇరాన్ కీలక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంటుందని హెచ్చరించారు.