నా పోర్ట్ఫోలియో కూడా నష్టాల్లోనే ఉంది: ఇన్వెస్టర్లకు ధైర్యం చెబుతున్న విజయ్ కేడియా
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు కరిగిపోతున్న వేళ, దిగ్గజ ఇన్వెస్టర్ విజయ్ కేడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపదను మార్కెట్ కాదు, మన సహనమే సృష్టిస్తుందని ఆయన హితవు పలికారు. ఇన్వెస్టర్లు ఈ సమయంలో పాటించాల్సిన సూత్రాలు వివరించారు.
స్టాక్ మార్కెట్ పతనం చూసి బెంబేలెత్తిపోతున్నారా? మీ డీమ్యాట్ అకౌంట్లో రెడ్ మార్క్ కనిపిస్తుంటే గుండె జారిపోతోందా? అయితే మీరు దిగ్గజ ఇన్వెస్టర్ విజయ్ కేడియా చెప్పిన ఈ మాటలు వినాల్సిందే. మార్కెట్ పరిస్థితులు మీ సంపదను మాత్రమే కాదు, అంతకు మించి మీ సహనాన్ని (Temperament) పరీక్షిస్తాయని ఆయన గుర్తుచేస్తున్నారు.

డీమ్యాట్ అకౌంట్ మార్కెట్ది.. బ్యాంక్ అకౌంట్ మీది!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వల్ల భారతీయ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేడియా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు.
"మీ డీమ్యాట్ స్టేట్మెంట్ మార్కెట్కు చెందుతుంది. కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు చెందుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు మీరు చూసింది కాగితం మీద లాభం (Paper Profit). ఇప్పుడు మీరు చూస్తున్న పతనం కూడా కాగితం మీద నష్టమే (Paper Loss). మీరు షేర్లను అమ్మే వరకు ఏదీ వాస్తవం కాదు" అని కేడియా తన 'ఎక్స్' (X) ఖాతాలో పేర్కొన్నారు. స్క్రీన్ మీద కనిపించే అంకెలను చూసి అనవసరంగా భయం పెంచుకోవద్దని ఆయన సూచించారు.
"నా పోర్ట్ఫోలియో కూడా తగ్గింది.."
సాధారణంగా మార్కెట్ దిగ్గజాలు తమ నష్టాల గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ కేడియా మాత్రం చాలా నిజాయితీగా స్పందించారు. ప్రస్తుతం తన పోర్ట్ఫోలియో కూడా ఒత్తిడిలో ఉందన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, మార్కెట్ పతనం వల్ల మానసిక ప్రశాంతతను, మూడ్ను పాడు చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఆందోళన చెందడం వల్ల పోర్ట్ఫోలియో మెరుగుపడకపోగా, అది మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ సంతోషాన్ని మాత్రమే దెబ్బతీస్తుందని ఆయన వివరించారు.
భయం మనసులోనే ఉంటుంది..
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లుగా ఎదగాలంటే ఇలాంటి పతనాలు ఒక పాఠం లాంటివని కేడియా అభిప్రాయపడ్డారు. "ఈ పరిస్థితులు మిమ్మల్ని కుంగదీయడానికి రాలేదు.. మిమ్మల్ని రాటుదేల్చడానికి వచ్చాయి. మీరు మీ మనసును గెలవాలి. బయట జరిగే సంఘటనలు అనిశ్చితిని సృష్టిస్తాయి.. కానీ భయం అనేది మన మనసులోనే రూపుదిద్దుకుంటుంది" అని ఆయన విశ్లేషించారు. ఎవరైతే గడ్డు కాలంలో ప్రశాంతంగా ఉంటారో, వారే భవిష్యత్తులో గొప్ప సంపదను సృష్టిస్తారని ఆయన పేర్కొన్నారు.
సంపదను సృష్టించేది సహనమే
మంచి స్టాక్స్ను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, మార్కెట్ పడుతున్నప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. బుల్ మార్కెట్లో అందరూ లాభాలు సంపాదిస్తారు, కానీ బేర్ మార్కెట్లో మాత్రమే అసలైన ఇన్వెస్టర్ ఎవరో తేలుతుంది. సంపదను సృష్టించేది మార్కెట్ కాదు, ఇన్వెస్టర్ యొక్క సహనమే అని కేడియా ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. పేపర్ లాస్ (Paper Loss) అంటే ఏమిటి?
మీరు కొన్న షేర్ల ధరలు తగ్గినప్పుడు మీ డీమ్యాట్ అకౌంట్లో నష్టాలు కనిపిస్తాయి. అయితే ఆ షేర్లను మీరు అమ్మనంత వరకు ఆ నష్టం ఖరారు కాదు. దాన్నే పేపర్ లాస్ అంటారు. ధరలు మళ్ళీ పెరిగితే ఆ నష్టం మాయమై లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
2. మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
అనవసరంగా భయాందోళనలకు గురై తక్కువ ధరకే షేర్లను అమ్మేయకూడదు. మీరు పెట్టుబడి పెట్టిన కంపెనీ ప్రాథమికంగా బలంగా ఉంటే, దీర్ఘకాలం పాటు వేచి చూడటం మంచిది.
3. విజయ్ కేడియా చెప్పిన 'టెంపర్మెంట్' (Temperament) అంటే ఏమిటి?
మార్కెట్ గందరగోళంలో ఉన్నప్పుడు భావోద్వేగాలకు లోనుకాకుండా, స్థిమితంగా నిర్ణయాలు తీసుకోవడాన్నే ఇక్కడ సహనం లేదా ప్రవృత్తిగా పేర్కొన్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


