అద్భుతం.. దక్షిణాఫ్రికాతో ఆదివారం రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ను వర్ణించడానికి ఇదే సరైన పదం. ఈ నెల ప్రారంభంలో 37వ పడిలోకి అడుగుపెట్టిన ఈ మాజీ భారత కెప్టెన్ తన 52వ వన్డే శతకాన్ని సాధించి, ఔరా అనిపించాడు. ప్రోటీస్ బౌలర్లను చితకబాదాడు. 2023 ప్రపంచ కప్లో రికార్డు స్థాయిలో పరుగులు చేసిన తర్వాత కోహ్లీ ప్రదర్శించిన అత్యుత్తమ ఆట ఇదే అనడంలో సందేహం లేదు.
కోహ్లి ఆధిపత్యం

సండే (నవంబర్ 30) సౌతాఫ్రికాతో ఫస్ట్ వన్డేలో కోహ్లి బ్యాటింగ్ 2016-19 నాటి అతని ఆధిపత్యాన్ని గుర్తు చేసింది. నంద్రే బర్గర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఔట్ చేయడంతో మూడవ ఓవర్లో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మొదటి బంతి నుంచే అతను పాత రోజులను గుర్తుచేసుకున్నట్లు కనిపించాడు. అక్కడి నుంచి అతను వెనక్కి తిరిగి చూడలేదు. 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా కోహ్లీ త్వరగా అడుగులు వేసి, బంతిని గాల్లోకి కొట్టాడు. పవర్ప్లేలో అతను రెండుసార్లు అలా చేశాడు.
అదే స్పీడ్
గతంలో మిడిల్ ఓవర్లలో తన వేగాన్ని తగ్గించుకుని, కోహ్లి స్లోగా ఆడతాడనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి ఏమీ జరగలేదని నిర్ధారించుకున్నాడు. అతను రెగ్యులర్ బౌండరీలతో స్కోర్బోర్డ్ను కదుపుతూనే ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి రెండవ వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మార్కో జాన్సెన్ లెగ్ బిఫోర్ ఔట్ చేయడంతో రోహిత్ (57) వెనుదిరిగినప్పటికీ, కోహ్లీ ఊపు తగ్గనీయలేదు. 38వ ఓవర్లో జాన్సెన్ బౌలింగ్లో తన 52వ వన్డే శతకాన్ని అందుకున్నాడు. ఒక చక్కటి బౌండరీతో అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు.
సెంచరీ సంబరాలు
వన్డేల్లో 52వ సెంచరీ అందుకున్న తర్వాత విరాట్ కోహ్లి సంబరాలు వైరల్ గా మారాయి. తనదైన స్టైల్లో గాల్లోకి ఎగురుతూ కోహ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ ఉత్సాహంతో గెంతుతూ గట్టిగా అరిచాడు. రాంచీ మొత్తం అరుపులతో మారుమోగిపోయింది. అతను తన ప్రియమైన లాకెట్ను ముద్దాడాడు. రెండు చేతులు జోడించి ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టాడు.
{{/usCountry}}వన్డేల్లో 52వ సెంచరీ అందుకున్న తర్వాత విరాట్ కోహ్లి సంబరాలు వైరల్ గా మారాయి. తనదైన స్టైల్లో గాల్లోకి ఎగురుతూ కోహ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ ఉత్సాహంతో గెంతుతూ గట్టిగా అరిచాడు. రాంచీ మొత్తం అరుపులతో మారుమోగిపోయింది. అతను తన ప్రియమైన లాకెట్ను ముద్దాడాడు. రెండు చేతులు జోడించి ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టాడు.
{{/usCountry}}అప్పుడే ఒక అభిమాని మైదానంలోకి పరిగెత్తి కోహ్లీ పాదాలను తాకాడు. భద్రతా సిబ్బంది ఆ చొరబాటుదారుడిని వేగంగా బయటకు తీసుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత తమ అభిమాన ఆటగాడు కోహ్లి ఒకప్పటిలా సెంచరీ చేయడం, సంబరాలు చేసుకోవడం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.