హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంది. వైశాఖ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' లేదా 'అచల ఏకాదశి' అని పిలుస్తారు. 'అపర' అంటే అపారమైన అని అర్థం. అంటే, ఈ రోజున భక్తితో పూజలు చేసే వారికి అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్ర వచనం. 2026 సంవత్సరంలో మే 13వ తేదీన ఈ పర్వదినం వచ్చింది.

ముఖ్యంగా ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడంతో పాటు తులసి పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అయితే, ఏకాదశి నాడు తులసి పూజ విషయంలో కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. వాటిని విస్మరిస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అపర ఏకాదశి తిథి.. ముహూర్తం ఎప్పుడు?
పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి మే 12వ తేదీ మధ్యాహ్నం 2:52 గంటలకు ప్రారంభమై, మే 13వ తేదీ మధ్యాహ్నం 1:29 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథిని ప్రామాణికంగా తీసుకునే సంప్రదాయం ప్రకారం, మే 13వ తేదీ బుధవారం నాడు భక్తులు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున చేసే విష్ణు నామ స్మరణ కోటి రెట్లు ఫలితాన్నిస్తుందని నమ్మకం.
తులసి పూజలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
అపర ఏకాదశి నాడు తులసి పూజ అత్యంత ఫలదాయకం. కానీ, ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం:
నీళ్లు పోయకూడదు: సాధారణంగా ప్రతిరోజూ తులసికి నీళ్లు పోయడం అలవాటు. కానీ ఏకాదశి నాడు తులసి మాత కూడా విష్ణుమూర్తి కోసం 'నిర్జల ఉపవాసం' (నీరు కూడా తాగకుండా ఉండే వ్రతం) ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున తులసి మొక్కకు నీరు పోయకూడదు.
ఆకులు కోయకూడదు: ఏకాదశి రోజున తులసి దళాలను కోయడం మహా పాపంగా పరిగణిస్తారు. విష్ణువుకు నైవేద్యం పెట్టడానికి తులసి ఆకులు కావాలనుకుంటే, ఒక రోజు ముందే అంటే దశమి నాడే కోసి పెట్టుకోవాలి.
{{/usCountry}}ఆకులు కోయకూడదు: ఏకాదశి రోజున తులసి దళాలను కోయడం మహా పాపంగా పరిగణిస్తారు. విష్ణువుకు నైవేద్యం పెట్టడానికి తులసి ఆకులు కావాలనుకుంటే, ఒక రోజు ముందే అంటే దశమి నాడే కోసి పెట్టుకోవాలి.
{{/usCountry}}స్పర్శ విషయంలో జాగ్రత్త: ఏకాదశి నాడు తులసి మొక్కను అనవసరంగా తాకకూడదు. కేవలం పూజ చేసేటప్పుడు మాత్రమే పద్ధతి ప్రకారం నమస్కరించాలి.
ఐశ్వర్యం కోసం అద్భుత పరిహారాలు
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు అపర ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కుంకుమపువ్వుతో అర్చన: తులసి మొక్కకు కుంకుమపువ్వు (Saffron) సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఇంట్లోని దరిద్రాన్ని తొలగించి, ధన ప్రాప్తికి మార్గాలను సుగమం చేస్తుంది.
దీపారాధన: సాయంత్రం వేళ తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి, 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
మంత్ర జపం: "ఓం నమో భాగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
పూజా విధానం ఇలా ఉండాలి..
ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. శుచిగా స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. పూజా గదిని శుభ్రం చేసి గంగాజలంతో సంప్రోక్షణ చేయాలి. విష్ణుమూర్తి పటాన్ని పసుపు పుష్పాలతో అలంకరించి, నైవేద్యంలో తులసి దళాలను ఉంచాలి. అనంతరం తులసి కోట వద్ద దీపం వెలిగించి, "ఓం తులస్యై నమః" మంత్రాన్ని పఠిస్తూ హారతి ఇవ్వాలి.
ఈ పద్ధతిలో అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కేవలం ఆర్థిక కష్టాలే కాకుండా, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. మే 13న వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ శ్రీహరి కృపకు పాత్రులు అవ్వండి.