సనాతన ధర్మంలో ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనవి. అయితే వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అపర ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని, అందుకే దీనికి 'అపర' అనే పేరు వచ్చిందని పండితులు చెబుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని అచల ఏకాదశి, భద్రకాళీ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.
తేదీ, ముహూర్తం

ప్రతి ఏటా తిథుల హెచ్చుతగ్గుల వల్ల ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధత భక్తులలో నెలకొంటుంది. 2026 సంవత్సరానికి సంబంధించి పంచాంగ కర్తలు అపర ఏకాదశి తేదీని ఖరారు చేశారు.
ఏకాదశి ప్రారంభం: మే 12, 2026 మధ్యాహ్నం 02:52 నిమిషాలకు తిథి మొదలవుతుంది.
ఏకాదశి ముగింపు: మే 13, 2026 మధ్యాహ్నం 01:29 నిమిషాలకు తిథి ముగుస్తుంది.
శాస్త్రం ప్రకారం ఉదయ తిథికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, మే 13, బుధవారం రోజున అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఇక వ్రతాన్ని విరమించే సమయం (పారణ) మే 14వ తేదీ ఉదయం 05:31 నుండి 08:14 గంటల మధ్య ఉంటుందని గుర్తుంచుకోవాలి.
అపర ఏకాదశి విశిష్టత
ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం గురించి పురాణాల్లో గొప్పగా వివరించారు. "అపర ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల బ్రహ్మహత్యా పాతకం వంటి దోషాలు సైతం తొలగిపోతాయి," అని పురాణాలు పేర్కొంటున్నాయి. కురుక్షేత్రంలో స్నానం చేయడం లేదా కాశీలో పిండ ప్రధానం చేయడం ద్వారా వచ్చే పుణ్యంతో ఈ ఏకాదశి వ్రతాన్ని పోలుస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు, మానసిక ప్రశాంతత కోరుకునే వారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.
అపర ఏకాదశి ఉపవాసం
రేపు అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి గోరపాపాల నుంచి కూడా అవిముక్తి కలుగుతుంది. కురుక్షేత్రంలో గంగా నది తీరన్న స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో పుష్కర స్నానాలు చేసినంత పుణ్యం కంటే ఎక్కువే లభిస్తుంది. ఏకాదశి వ్రతం చేయడం వలన అశాంతి,ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఏకాదశి వ్రతం వల్ల వచ్చే పుణ్యం చాలా ఎక్కువ అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు.
పూజా విధానం, నియమాలు
{{/usCountry}}రేపు అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి గోరపాపాల నుంచి కూడా అవిముక్తి కలుగుతుంది. కురుక్షేత్రంలో గంగా నది తీరన్న స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో పుష్కర స్నానాలు చేసినంత పుణ్యం కంటే ఎక్కువే లభిస్తుంది. ఏకాదశి వ్రతం చేయడం వలన అశాంతి,ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఏకాదశి వ్రతం వల్ల వచ్చే పుణ్యం చాలా ఎక్కువ అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు.
పూజా విధానం, నియమాలు
{{/usCountry}}ఈ పవిత్రమైన రోజున భక్తులు అనుసరించాల్సిన పద్ధతులు ఇవే:
శుచీ శుభ్రత: సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం విష్ణువుకు ప్రీతికరం.
సంకల్పం: దేవుని గదిని శుభ్రం చేసి, దీపారాధన అనంతరం శ్రీహరిని స్మరిస్తూ వ్రత సంకల్పం తీసుకోవాలి.
నైవేద్యం: విష్ణువుకు తులసి దళాలు అంటే మహా ఇష్టం. కాబట్టి పూజలో తులసిని తప్పనిసరిగా వాడాలి. పండ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించవచ్చు.
స్తోత్ర పఠనం: రోజంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా 'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
దీపారాధన: సాయంత్రం వేళ తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఏకాదశి వ్రతం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం కూడా. ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా, సాత్విక భావంతో ఉంటూ పేదలకు దానధర్మాలు చేయడం వల్ల ఈ వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది.