వాస్తు శాస్త్రం: ఉదయం, సాయంత్రం పొరపాటున కూడా ఈ 5 పనులు చేయద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ఆర్థిక నష్టం పెరుగుతుంది!

వాస్తు శాస్త్రం: ఇంట్లో కొన్ని చిన్న తప్పులు లక్ష్మీమాతకు కోపం తెప్పిస్తాయి. ఇది ఆర్థిక నష్టాలు, అప్పులు, వ్యతిరేక శక్తి పెరగడానికి దారితీస్తుంది. ఉదయం మరియు సాయంత్రం కొన్ని చేయడం వల్ల ఇంటి యొక్క సానుకూల శక్తి, సంపద పెరుగుతుంది. మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం.

Published on: Mar 25, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు శాస్త్రం, హిందూ విశ్వాసాల ప్రకారం, ఇంట్లో కొన్ని చిన్న తప్పులు లక్ష్మీమాతకు కోపం తెప్పిస్తాయి. ఇది ఆర్థిక నష్టాలు, అప్పులు, వ్యతిరేక శక్తి పెరగడానికి దారితీస్తుంది. ఉదయం మరియు సాయంత్రం కొన్ని చేయడం వల్ల ఇంటి యొక్క సానుకూల శక్తి, సంపద పెరుగుతుంది. మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం.

ఉదయం, సాయంత్రం ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? చేయకూడని తప్పులు ఏవి? (gemini AI)
ఉదయం, సాయంత్రం ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? చేయకూడని తప్పులు ఏవి? (gemini AI)

ఉదయం, సాయంత్రం ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? చేయకూడని తప్పులు ఏవి?

తులసి ఆకులు: తులసి ఆకులను సాయంత్రం పూట కోయవద్దు. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. తులసి ఆకులను మరచియి కూడా సాయంత్రం పూట తెంపకూడదు. సాయంత్రం తులసి మొక్కను తాకితే లక్ష్మీదేవి కోపం వచ్చి, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బలహీనపడటం ప్రారంభమవుతుంది. పూజ కోసం బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే తులసి ఆకులను కోసి పరిశుభ్రమైన నీటిలో ఉంచాలి. ఇది లక్ష్మీమాతను సంతోషంగా ఉంచుతుంది. ఇంట్లో సంపదను పెంచుతుంది.

చెత్త: సాయంత్రం సంధ్యవేళలో ఇంటిని చదవకూడదు. చీకటి పడ్డాక చెత్తను పారబోయకూడదు. చెత్త పారేస్తే ఇంటి యొక్క సానుకూల శక్తి బయటకు వెళ్లి, పేదరికానికి దారితీస్తుంది. అప్పులు పెరిగే అవకాశం ఉంది. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయండి, తద్వారా రాత్రిపూట పేరుకుపోయిన వ్యతిరేక శక్తి తొలగిపోతుంది మరియు రోజంతా సానుకూల వాతావరణం ఉంటుంది.

సాయంత్రం నిద్రపోకూడదు: సాయంత్రం ఎప్పుడూ నిద్రపోకండి: సాయంత్రం పూజ, ధ్యానం మరియు భగవంతుణ్ణి స్మరించుకునే సమయం. ఈ సమయంలో నిద్రపోవడం పాపంగా భావిస్తారు. సాయంత్రం నిద్రపోయే వారికి భగవంతుడి కృప తక్కువగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారు లేదా చిన్న పిల్లలు మాత్రమే ఈ నియమం నుండి మినహాయించబడతారు. సాయంత్రం నిద్రపోవడం వల్ల సోమరితనం పెరుగుతుంది. ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది. ఈ సమయంలో కుటుంబంతో కూర్చుని భజనలు, కీర్తనలు పాడడం వంటివి చేస్తే మంచిది.

డబ్బు: సోమవారం లేదా బుధవారం నాడు లావాదేవీలు, పెట్టుబడులు లేదా రుణాలు తిరిగి చెల్లించడం వంటి డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజుల్లో చేసిన పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. అప్పులు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇతర రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీయవచ్చు.

లక్ష్మీ అనుగ్రహం: లక్ష్మీమాతను సంతోషపెట్టడానికి వివాహిత మహిళలు గురువారం ఉపవాసం ఉండడం చాలా ప్రయోజనకరం. ఈ రోజున పేద వివాహిత మహిళకు కుంకుమ, నల్లపూసలు, గాజులు మొదలైనవి దానం చేయడం ద్వారా విష్ణువు, లక్ష్మీమాత యొక్క ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఇది క్రమేపీ ఇంటి యొక్క అన్ని సమస్యలను తొలగిస్తుంది మరియు సంపద, సంవృద్ధి పెరుగుతుంది.

గోడలు: ఇంటి గోడలు మరియు నేలపై పెన్సిల్, సుద్ద లేదా దేనితోనూ ఏమీ రాయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం,ఇది ఇంటిలో వ్యతిరేక శక్తిని పెంపొందిస్తాయి. ఇది ఆర్థిక ఎదుగుదలను నిలిపివేస్తుంది మరియు అప్పులు పెరగడానికి కారణమవుతుంది. గోడలపై రాయడం లేదా గీసే అలవాటు వద్దని పిల్లలకు వివరించండి. ఇంటి గోడలను శుభ్రంగా ఉంచండి.

ఇల్లు శుభ్రం: ఉదయం లేవగానే ఇంటిని తుడుచుకోవాలి. దానికి ముందు పూజ, అల్పాహారం లేదా మరే ఇతర పనులు చేయవద్దు. తుడిచినప్పుడు రాత్రిపూట పేరుకుపోయిన వ్యతిరేక శక్తి తొలగిపోతుంది మరియు ఇంట్లో తాజాదనం ఏర్పడుతుంది. ఇది కుటుంబ సభ్యులను శక్తివంతంగా ఉంచుతుంది. ప్రతి రంగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సరళమైన నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీమాత సంతోషంగా ఉంటుంది. ఇంట్లో సంతోషం, సంవృద్ధి ఉంటుంది. చిన్న చిన్న తప్పులను నివారించడం ద్వారా జీవితాన్ని సానుకూలంగా మార్చుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More