వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. దీనికి 'అచల ఏకాదశి' అనే పేరు కూడా ఉంది. ఈ ఏడాది మే 13వ తేదీన అనగా ఈరోజు అపర ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఏకాదశి, ద్వాదశి తిథుల కలయిక ఉండటం వల్ల ఈ పర్వదినానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని పద్మపురాణం చెబుతోంది.
అపర ఏకాదశి విశిష్టత

"రాజేంద్రా! లోక కళ్యాణం కోసం నువ్వు మంచి విషయం అడిగావు. వైశాఖ కృష్ణ పక్ష ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఇది అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుంది. బ్రహ్మహత్య, గోత్ర హత్య, పిండహత్య వంటి మహా పాపాలు చేసిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాప విముక్తులవుతారు," అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించారు.
కేవలం శారీరక పాపాలే కాకుండా.. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, తూకాల్లో మోసం చేసేవారు, అర్హత లేకుండా వైద్యం చేసేవారు, యుద్ధం నుంచి పారిపోయే క్షత్రియులు కూడా ఈ వ్రత ప్రభావంతో పవిత్రులవుతారు. గురువును నిందించే వారు కూడా ఈ ఏకాదశి ఉపవాసంతో సద్గతి పొందుతారని పురాణ కథనం.
తీర్థయాత్రల ఫలితం మీ ఇంట్లోనే
అపర ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం అసాధారణమైనది. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో స్నానం చేసినా, కాశీలో శివరాత్రి వ్రతం చేసినా, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసినా ఎంత పుణ్యం వస్తుందో.. ఈ ఒక్క ఏకాదశి వ్రతం వల్ల అంతటి ఫలితం లభిస్తుంది. అలాగే సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు గోదావరి స్నానం చేసినా, బదరీనాథ్ యాత్ర చేసినా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో దానధర్మాలు చేసినా వచ్చే పుణ్యంతో ఈ వ్రతం సమానమని పెద్దలు చెబుతారు.
అపర ఏకాదశి వ్రత కథ
మహీధ్వజుడి కథ: ప్రేత రూపం నుంచి విముక్తి
పూర్వం మహీధ్వజుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. ఆయన తమ్ముడు వజ్రధ్వజుడు పరమ క్రూరుడు. అన్నపై ద్వేషంతో వజ్రధ్వజుడు ఆయనను చంపి, మృతదేహాన్ని అడవిలోని ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు. అకాల మరణం చెందడం వల్ల మహీధ్వజుడు ప్రేతాత్మగా మారి అదే చెట్టుపై నివాసం ఉంటూ బాటసారులను ఇబ్బంది పెట్టేవాడు.
{{/usCountry}}పూర్వం మహీధ్వజుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. ఆయన తమ్ముడు వజ్రధ్వజుడు పరమ క్రూరుడు. అన్నపై ద్వేషంతో వజ్రధ్వజుడు ఆయనను చంపి, మృతదేహాన్ని అడవిలోని ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు. అకాల మరణం చెందడం వల్ల మహీధ్వజుడు ప్రేతాత్మగా మారి అదే చెట్టుపై నివాసం ఉంటూ బాటసారులను ఇబ్బంది పెట్టేవాడు.
{{/usCountry}}ఒకరోజు ధౌమ్య మహర్షి ఆ దారిలో వెళ్తూ తన తపోబలంతో రాజు గతాన్ని తెలుసుకున్నారు. ఆ ప్రేతాత్మను రావి చెట్టు నుంచి కిందకు దింపి, అతడికి పరలోక విద్యను బోధించారు. మహీధ్వజుడికి విముక్తి కల్పించడానికి ధౌమ్య మహర్షి స్వయంగా అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఆ పుణ్యాన్ని రాజుకు ధారపోశారు. ఆ వ్రత ప్రభావంతో రాజుకు దివ్యరూపం లభించి స్వర్గానికి చేరుకున్నాడు.
పూజా విధానం, నియమాలు
- అపరా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును వామన రూపంలో పూజించాలి.
- దశమి నాటి రాత్రి నుంచే నియమాలు పాటించాలి.
- ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి, విష్ణువును భక్తితో అర్చించాలి.
- ఈ రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్ఠం. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు తీసుకోవచ్చు.
- ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి, విష్ణువుకు నైవేద్యం సమర్పించాలి.
- ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణాదులు సమర్పించిన తర్వాతే భోజనం చేయాలి.
- ఈ కథను చదివినా లేదా విన్నా కూడా వెయ్యి గోదానాలు చేసినంత ఫలితం దక్కుతుందని వేదవ్యాస మహర్షి వివరించారు.