తెలుగు నెలల్లో నాల్గవది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలు వంటివి జరపరు. అలాగే కొత్తగా పెళ్లయిన కోడలు కూడా అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఇలా కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము.

పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. మిగిలిన నెలలతో పోల్చుకుంటే ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు ఇది సరైన సమయం అని చెబుతారు. ఈ నెలలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసంలో ఎలాంటి పర్వదినాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆషాఢ శుద్ధ విదియ
జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు, జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర, బలభద్రులతో కలిసి భక్తులందరికీ దర్శనమిచ్చే పూరి జగన్నాథుడి ఆలయంలో అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. అలాగే ఆషాఢ శుద్ధ విదియ నాడు తోబుట్టువులతో కలిసి జగన్నాథుడు ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టి గుండిచా క్షేత్రానికి చేరుకుంటాడు. అనంతరం మళ్లీ తిరిగి వస్తాడు. ఈ వేడుకను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. రథయాత్రలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశి
ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్తాడు. మళ్లీ నాలుగు నెలల తర్వాత, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు మేల్కొంటాడు. దానిని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు
బోనాలు
తెలంగాణలో బోనాలు సమర్పించే సంప్రదాయం ఉంది. "బోనం" అంటే భోజనం అని అర్థం. ఈ బోనాల సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని విశ్వసిస్తారు. అలా వచ్చే శక్తి స్వరూపిణికి బోనంతో సారెను సమర్పిస్తారు. ఒకప్పుడు ప్లేగు వ్యాధిని అమ్మవారు తరిమికొట్టారని, అందుకే కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందని భక్తుల విశ్వాసం.
ఆషాఢ శుద్ధ పూర్ణిమ
ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు గురువులను పూజించి సత్కరించే సంప్రదాయం ఉంది. దీనిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు కూడా అదే రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా పేరు. గురు పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
{{/usCountry}}ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు గురువులను పూజించి సత్కరించే సంప్రదాయం ఉంది. దీనిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు కూడా అదే రోజు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా పేరు. గురు పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.