వట పూర్ణిమ 2026: ఈరోజు భర్త ఆయురారోగ్యం, కుటుంబ సుఖ శాంతుల కోసం తప్పక చేయాల్సిన పరిహారాలు!
సనాతన ధర్మంలో వివాహిత మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ 'వట పూర్ణిమ'. మర్రిచెట్టును పూజించి, భర్త దీర్ఘాయుష్షును కాంక్షించే ఈ వ్రతం వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు, మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఇక్కడ చూడండి.
పురాణాల ప్రకారం, మృత్యువును ఎదిరించి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకున్న సావిత్రీదేవి కథే ఈ వట పూర్ణిమకు మూలం. ఆ రోజు నుంచి భర్త క్షేమం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కేవలం పూజ చేయడమే కాకుండా, కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం వల్ల దాంపత్య జీవితం మరింత బలోపేతం అవుతుందని పండితులు చెబుతున్నారు.

సుఖ శాంతుల కోసం చేయాల్సిన పనులు
దారం చుట్టడం: పూజా సమయంలో మర్రిచెట్టుకు 7 లేదా 108 సార్లు దారాన్ని చుట్టండి. ప్రతి ప్రదక్షిణలోనూ భర్త ఆయుష్షు, కుటుంబ శ్రేయస్సును కోరుకోండి. పూజ పూర్తయ్యాక, ఒక కొత్త తెల్లని దారాన్ని బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల కుటుంబంలోని కష్టాలు తొలగిపోతాయి.
దాన ధర్మాలు: వట పూర్ణిమ పూజ అనంతరం వెదురుతో చేసిన చేతి విసనకర్రను తీసుకోండి. దానిపై నానబెట్టిన శనగలు, తాజా పండ్లు, వస్త్రాలను ఉంచి అత్తగారికి లేదా ఇంట్లోని పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇది ఇంట్లో అనురాగాలను పెంచుతుంది.
శివ-పార్వతుల ఆరాధన: మర్రిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం. కాబట్టి, ఆ రోజు శివపార్వతులను ప్రత్యేకంగా పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయి, బంధం బలపడుతుంది.
ఆర్థిక సమస్యలు బాధిస్తున్నాయా? అయితే ఈ చిన్న పరిహారాలను పాటించి చూడండి
చాలా కాలంగా మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే, పూర్ణిమ రాత్రి చంద్రుడిని ఆరాధించడం మర్చిపోకండి. కొంచెం పచ్చి పాలు, బియ్యం, చక్కెర కలిపిన మిశ్రమంతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. మీ మనసులోని కోరికలను నివేదించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని శాస్త్ర వచనం.
గుర్తుంచుకోవాల్సిన నియమాలు
వట పూర్ణిమ రోజున వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం.
నలుపు, నీలం లేదా తెలుపు రంగు బట్టలను ఈ రోజున ధరించకపోవడం ఉత్తమం.
మీ ఇంటి సమీపంలో మర్రిచెట్టు లేదని చింతించకండి. కుండీలో ఓ మర్రి కొమ్మను లేదా తులసి కోటను ముందు ఉంచుకుని భక్తితో పూజించినా అదే ఫలితం లభిస్తుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


