హిందూ ధర్మంలో పౌర్ణమి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతినెలా వచ్చే పౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ పవిత్ర దినాన జగత్ రక్షకుడు శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి దేవిని, చంద్ర భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని, సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని అత్యంత పవిత్రమైన గురు పౌర్ణమి' లేదా ఆషాఢ పౌర్ణమిగా జరుపుకుంటారు. అయితే, ఈ ఏడాది పౌర్ణమి తిథి రెండు రోజులు రావడంతో అసలు వ్రతం మరియు పూజా కార్యక్రమాలు ఏ రోజు నిర్వహించాలనేదానిపై భక్తులలో కొంత గందరగోళం నెలకొంది.
ఆషాఢ పౌర్ణమి తేదీ మరియు సరైన సమయం
హిందూ పంచాంగం ప్రకారం, ఆషాఢ శుక్ల పౌర్ణమి తిథి జూలై 28, 2026 మధ్యాహ్నం 02:48 గంటలకు ప్రారంభమై, జూలై 29, 2026 సాయంత్రం 04:35 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి, ఆషాఢ పౌర్ణమిని జూలై 29, 2026 బుధవారం రోజునే పాటించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ రోజే పౌర్ణమి వ్రతం ఆచరించడం, పవిత్ర స్నానాలు మరియు దానాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని శాస్త్ర వచనం.
అరుదైన శుభ యోగాల కలయిక
ఈసటి ఆషాఢ పౌర్ణమి రోజున ఎంతో విశిష్టమైన 'ప్రీతి' మరియు 'ఆయుష్మాన్' యోగాలు అరుదైన రీతిలో ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ పవిత్ర యోగాల సమయంలో చేసే దైవారాధన, పూజలు మరియు మంచి పనులకు విశేషమైన ఫలితాలు దక్కుతాయి. దీనివల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, అదృష్టం తలుపు తడుతుందని నమ్ముతారు.
పూజా ముహూర్తాలు మరియు చంద్రోదయ సమయం
పౌర్ణమి రోజున అనుసరించాల్సిన ముఖ్యమైన ముహూర్తాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
{{/usCountry}}పౌర్ణమి రోజున అనుసరించాల్సిన ముఖ్యమైన ముహూర్తాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
{{/usCountry}}బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05:10 నుండి ఉదయం 05:45 వరకు.
ప్రాతః సంధ్య: ఉదయం 05:27 నుండి ఉదయం 06:20 వరకు.
విజయ ముహూర్తం: సాయంత్రం 04:29 నుండి సాయంత్రం 05:30 వరకు.
గోధూళి ముహూర్తం: రాత్రి 09:34 నుండి రాత్రి 09:51 వరకు.
అలాగే, ఈ పవిత్ర దినాన రాత్రి 09:53 గంటలకు చంద్రోదయం అవుతుంది. చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జాతకంలో చంద్ర దోషాలు తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతారు.
ఆషాఢ పౌర్ణమి నాడు చేయవలసిన దానాలు
పౌర్ణమి రోజున చేసే దానానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ పర్వదినాన శక్తికొలది పేదలకు సహాయం చేయడం మంచిది. అన్నం, మంచి నీరు, ఆవు నెయ్యి, గోధుమలు, వస్త్రాలు, గొడుగు మరియు ధనాన్ని దానంగా ఇవ్వడం ద్వారా విశేష పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు చేసే దానధర్మాల వల్ల ఇంటా బయటా సిరిసంపదలు వర్ధిల్లుతాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.