విశ్వావసునామ సంవత్సరానికి స్వస్తి పలికి, పరాభవనమ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాది ఉగాది పండుగ వచ్చిన విషయం తెలిసిందే. హిందువులు జరుపుకునే ముఖ్య పండుగల్లో చైత్ర నవరాత్రులు ఒకటి. తొమ్మిది రోజులు పాటు భక్తులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ఆరాధిస్తారు. అలాగే ఉపవాసాలు ఉంటారు. ఇలా చేయడం వలన కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. మార్చి 19 నుంచి మార్చి 27 వరకు చైత్ర నవరాత్రులు. మార్చి 19 నుంచి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది.

చైత్ర శుక్ల పాడ్యమి ఉదయం 6:52కి ప్రారంభమవుతుంది, మార్చి 20 ఉదయం 4:52తో ముగుస్తుంది. మార్చి 19న కలశ స్థాపన చేసి నవరాత్రుల పూజలు మొదలుపెట్టాలి. ఉగాది నాడు తలస్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేసుకోవాలి. అలాగే పూజ అయిన తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఉగాది పచ్చడి తింటే షడ్రుచులను సమానంగా స్వీకరించాలి అనే సందేశం ఇస్తుంది. ప్రత్యేక గ్రహ స్థితుల మధ్య ఈ ఏడాది వసంత నవరాత్రులు మొదలవుతాయి. తొమ్మిది రోజులు కూడా నవరాత్రులను చాలా మంది నిష్ఠగా చేస్తారు.
చైత్ర నవరాత్రులు 2026
మొదటి రోజు (మార్చి 19): ఉత్తరాభాద్ర నక్షత్రం, శుక్ల యోగం వస్తోంది. ఆ రోజు కలశ స్థాపన చేసే పూజలు చేయాలి. మార్చి 19 ఉదయం 6:52 నుంచి 10:16 వరకు కలశ స్థాపన చేయడానికి శుభ ముహూర్తం. ఒకవేళ ఈ సమయంలో చేయలేకపోతే, 11:52 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు అభిజిత్ ముహూర్తంలో కలశ స్థాపన చేసుకోవచ్చు.
చైత్ర నవరాత్రులు పూజా విధానం:
నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకోండి. తర్వాత రోజు, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రభాత సమయంలో శ్రీరాముడిని, లలితాదేవిని, పరమేశ్వరుడిని ఆరాధించే సంకల్పం చెప్పుకోండి.
{{/usCountry}}నవరాత్రులు ప్రారంభానికి ముందు రోజు పసుపు, కుంకుమ, గంధం, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేసుకోండి. తర్వాత రోజు, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రభాత సమయంలో శ్రీరాముడిని, లలితాదేవిని, పరమేశ్వరుడిని ఆరాధించే సంకల్పం చెప్పుకోండి.
{{/usCountry}}మొదట వినాయకుడిని ఆరాధించి, ఆ తర్వాత దేవి మంత్రాలను తొమ్మిది రోజులు జపించాలి.
గౌరీ పంచాక్షరి, షోడషీ మంత్రాలు, బాల షడాక్షరి, పంచదశి ఇవి దేవికి సంబంధించినవి. కాబట్టి వీటిని చదువుకోవచ్చు.
అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళితో అమ్మవారిని ఆరాధించి, ధూపం, దీపం, నైవేద్యాలను సమర్పించాలి.
చివరగా నీరాజనాలను కూడా సమర్పించాలి. వసంత నవరాత్రుల చివరి రోజు శ్రీరామనవమి. ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి.
ఉగాది పూజా విధానం:
ఉగాది నాడు ఇంటిని శుభ్రంగా కడుక్కొని, మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టుకోండి.
ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయండి. ఉదయం స్నానం చేసే ముందు ఆవుపేడతో కల్లాపు జల్లాలి.
అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి.
ఉగాది సూర్యుడికి సంబంధించిన పండుగ కాబట్టి సూర్యుడికి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించాలి.
ఇంటి ఇలవేల్పుని కూడా ప్రత్యేకంగా ఉగాది నాడు పూజించాలి.
పూజ అయిపోయిన తర్వాత షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇలా ఉగాది నాడు ఆచరించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. సుఖసంతోషాలు, సౌభాగ్యం, విజయాలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది చాలా మంచి రోజు.