కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా కొత్త తెలుగు సంవత్సరం బాగా కలిసి రావాలని అనుకుంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎదురైన ఇబ్బందులు కొత్త సంవత్సరంలో రాకూడదని ఎంతో భక్తితో, శ్రద్ధగా ఉగాదిని మొదలు పెడతారు. ఉగాది నాడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.

నిజానికి ఉగాది నాడు తప్పకుండా ఈ పది శుభ పనులు చేయడం మంచిది. ఇలా చేయడం వలన సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. కష్టాలేమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు ఉగాది నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం.
ఖచ్చితంగా ఉగాది రోజు గుర్తు పెట్టుకుని ఈ 10 పనులు చేయాల్సిందే
త్వరగా నిద్ర లేచి స్నానం: ఉగాది రోజు త్వరగా నిద్ర లేచి స్నానం చేయండి. శరీరం, మనసు రెండూ పవిత్రంగా మారతాయి.
ఇంటిని శుభ్రం చేసి తోరణాలు కట్టండి: ఉగాది నాడు ఇంటిని శుభ్రం చేసి ముఖద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచి మామిడి ఆకులతో తోరణాలు కట్టండి. ఇలా చేయడం వలన శుభం, ఐశ్వర్యం కలుగుతాయి.
దేవుడికి పూజ: ఉగాది నాడు కచ్చితంగా దేవుని ఆశీర్వాదంతో ప్రారంభించండి. దాంతో దైవానుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. కష్టాలు కూడా తొలగిపోతాయి.
ఉగాది పచ్చడి: ఉగాది పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి. జీవితంలో ఆరు రుచులను స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు తెలుపుతుంది.
పంచాంగ శ్రవణం: కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది, గ్రహాల ప్రభావం వంటివి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.
దేవాలయ దర్శనం: దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కుటుంబానికి శుభం కలుగుతుందని పండితులు తెలుపుతున్నారు.
{{/usCountry}}దేవాలయ దర్శనం: దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కుటుంబానికి శుభం కలుగుతుందని పండితులు తెలుపుతున్నారు.
{{/usCountry}}పెద్దల ఆశీర్వాదం: పెద్దల ఆశీర్వాదం ఉండాలి. అప్పుడే ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయి.
దానాలు: మీకు తోచిన వాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అన్నదానం, వస్త్రదానం ఇలా ఏదైనా చేయొచ్చు.
కొత్త పనులు: ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో అడ్డంకులు ఉండవు.
మంచి సంకల్పం చేసుకోండి: కొత్త ఏడాది మంచి ఆలోచనలతో ప్రారంభించుకోండి. మంచి సంకల్పం చేసుకుని ఉగాది నుంచి ఏడాది అంతా బాగా కలిసి రావాలని కొత్త పనులను మొదలు పెట్టండి. ఇలా ఈ 10 శుభ పనులను ఉగాది రోజు చేయడం వలన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలుగుతాయి.
ఉగాది నాడు గణపతి ఆలయానికి వెళ్లి ఇలా చేయండి:
ఉగాది నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించండి. అలాగే ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించండి. ఇది శుభ ఫలితాలను కలిగేలా చేస్తుంది. పైగా వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. కాబట్టి మీ కొత్త ఏడాదిని ఇలా మొదలు పెడితే వినాయకుని అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే అర్చన చేయించుకోండి. “ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని పఠించండి.