మంగళవారం ఈ 5 వస్తువులను దానం చేయండి.. హనుమంతుడి కృపతో కష్టాలన్నీ తీరిపోతాయి!

ఆంజనేయస్వామిని సంకట మోచనుడు అని పిలుస్తారు. మంగళవారం నాడు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Published on: May 19, 2026, 08:32:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ ధర్మంలో హనుమంతుడిని 'సంకట మోచనుడు' అని పిలుస్తారు. అంటే భక్తుల కష్టాలను చిటికెలో తీర్చివేసే దైవమని అర్థం. ఎవరిపై అయితే ఆంజనేయస్వామి కృపాకటాక్షాలు ఉంటాయో, వారి జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవని భక్తుల నమ్మకం. అందుకే పవనపుత్రుడి ఆశీస్సుల కోసం భక్తులు రకరకాల పూజలు, పరిహారాలు చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బజరంగబలిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం అత్యంత విశేషమైన రోజు.

మంగళవారం ఈ 5 వస్తువులను దానం చేయండి.. హనుమంతుడి కృపతో కష్టాలన్నీ తీరిపోతాయి! (chat gpt)
మంగళవారం ఈ 5 వస్తువులను దానం చేయండి.. హనుమంతుడి కృపతో కష్టాలన్నీ తీరిపోతాయి! (chat gpt)

మంగళవారం నాడు హనుమంతుడిని విధివిధానంగా పూజించడంతో పాటు, కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని వల్ల జాతకంలో కుజ గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మంగళవారం ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1.బూందీ లడ్డూలు

ఆంజనేయ స్వామికి ఇష్టమైన నైవేద్యాలలో శనగపిండి లడ్డూలు ప్రధానమైనవి. మంగళవారం నాడు స్వామివారికి లడ్డూలను సమర్పించి, వాటిని పేదలకు లేదా భక్తులకు దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల స్వామివారి ప్రత్యేక అనుగ్రహం లభించి, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు.

2.ఎరుపు రంగు వస్తువులు

హనుమంతుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతి. అందుకే మంగళవారం నాడు ఎరుపు రంగులో ఉండే చీర లేదా జాకెట్టు ముక్క దానం చేయండి. లేదంటే కనీసం చేతి రుమాలు వంటివి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. ఈ చిన్న దానం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది.

3.ఎర్ర కందిపప్పు

చాలామంది పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని లేదా మానసిక ప్రశాంతత లేదని ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మంగళవారం నాడు ఎర్ర కందిపప్పును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వివాహ ప్రయత్నాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.

4.వేయించిన శనగలు

పురాణాల ప్రకారం మంగళవారం నాడు వేయించిన శనగలను బెల్లంతో కలిపి దానం చేయడం గొప్ప పుణ్యకార్యం. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడి కృపతో ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది.

5.గోధుమ రవ్వ, బియ్యం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తోంది. మంగళవారం నాడు గోధుమ రవ్వ (దలియా) లేదా బియ్యాన్ని దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది. దీని వల్ల రుణ బాధలు తొలగిపోయి, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారని నమ్మకం.

మంగళవారం వీటిని దానం చేయకండి

మంగళవారం నాడు కొన్ని వస్తువులను దానం చేయడం అశుభంగా భావిస్తారు. ఈ రోజున చిరిగిన బట్టలు, తామసిక ఆహారం (మాంసాహారం వంటివి), పదునైన వస్తువులు, డబ్బు, నలుపు రంగు వస్తువులు లేదా పాడైపోయిన ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More