12 ఏళ్ల తర్వాత 6 రాశులకు డబుల్ జాక్‌పాట్ ఇస్తున్న గురు ఆదిత్య రాజయోగం, పనుల్లో సక్సెస్!

ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన రాశిని, నక్షత్రాన్ని మార్చుకుంటుంది. ఇది మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే గురు, సూర్యుడు కలిసి గురు ఆదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నారు. దీంతో 6 రాశులకు అదృష్టం కలిసి వస్తుంది.

Published on: Jul 12, 2026, 18:30:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురు భగవానుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జులై 16న సూర్యుడు ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా ఈ సూర్య సంచారం కారణంగా సూర్యుడు, గురువు కర్కాటక రాశిలో కలుస్తారు. దీని కారణంగా చాలా శుభప్రదమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం ఆగస్టు 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై కనిపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మంచి సంపదను, అభివృద్ధిని పొందుతారు. ఆ అదృష్ట ఏంటో చూడండి.

జ్యోతిష్యం
జ్యోతిష్యం

మేష రాశి

మేష రాశి వారి 4వ ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు లభిస్తాయి. దీనివల్ల అప్పుల సమస్యలు తగ్గుతాయి. పని నిమిత్తం చేసే సుదూర ప్రయాణాలు మంచి ఆర్థిక లాభాలను తెస్తాయి. మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇది మంచిది. వైవాహిక జీవితంలోని సమస్యలు పరిష్కారమై, దంపతుల మధ్య బంధం బలపడుతుంది.

మిథున రాశి

మిథున రాశి రెండో ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి వారి జీవితంలో అనేక మంచి మార్పులు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. చేసే ప్రతి ఉద్యోగంలో మంచి విజయం సాధించవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. సమాజంలో గౌరవం, మర్యాద, ప్రతిష్ట పెరుగుతాయి. మీరు వ్యక్తిగత, వృత్తి జీవితంలో మంచి పురోగతిని చూస్తారు.

సింహ రాశి

సింహ రాశి వారి 12వ ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు జీవితంలో అనేక మంచి మార్పులను చూడవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. అప్పుల సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. మీకు మీ తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఇది మంచిది. మీరు మీ వృత్తిలో మంచి విజయాన్ని పొందుతారు.

కన్యా రాశి

కన్యారాశి 11వ ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి వృత్తిపరమైన పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంపద పెరుగుతుంది. మీరు అనేక కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పని చేసే చోట ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీకు మంచి భౌతిక సౌకర్యాలు లభిస్తాయి.

తులా రాశి

తులా రాశి 10వ ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలోని డబ్బు సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలోని పలుకుబడి ఉన్న వ్యక్తుల స్నేహం మీకు లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. అదృష్టం పూర్తి సహకారం అందించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మంచి విజయం సాధించవచ్చు. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి 8వ ఇంట్లో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ రాశివారి సామాజిక హోదా పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోయి, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. న్యాయపరమైన సమస్యల నుంచి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. నగదు ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More