హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఏకాదశి రోజున చేసే దీపదానానికి అద్భుతమైన శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున దీపదానం చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కృపాకటాక్షాలు పొందడానికి ఈ రోజు చేసే కొన్ని దీపారాధన పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లోని దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు దూరం కావాలంటే యోగిని ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలు వెలిగించాలి.
ఇంటి ఈశాన్య మూలన

ఏకాదశి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో మీ ఇంటి పూజా గదిలో లేదా ఈశాన్య దిశలో ఒక దీపాన్ని తప్పకుండా వెలిగించండి. ఇంటికి ఈశాన్య మూలను దేవుడి స్థానంగా భావిస్తారు. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నులవుతారు. అంతేకాకుండా ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, ఎప్పటికీ ధనధాన్యాలకు కొదవ ఉండదు.
ఇంటి ప్రధాన ద్వారం
సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన గుమ్మం వెలుపల దీపం ఉంచడం చాలా మంచిది. సాయంత్రం వేళ దేవుళ్ళు సంచరిస్తారని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో ముఖద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూలతలు తొలగిపోతాయి.
విష్ణు, లక్ష్మీ మందిరాలలో
మీకు వీలైనైతే యోగినీ ఏకాదశి రోజు సమీపంలోని ఏదైనా ఆలయానికి వెళ్లి లక్ష్మీ నారాయణుల చరణాల వద్ద దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి, వ్యాపారంలో మంచి వృద్ధి కనిపిస్తుంది.
తులసి మొక్క
ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి యోగినీ ఏకాదశి రోజు ఉదయం, సాయంత్రం తులసి పూజ చేయండి. సనాతన ధర్మంలో తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తులసి కోట వద్ద దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే నివసిస్తుందని నమ్ముతారు.
రావి చెట్టు
ఏకాదశి రోజు ఉదయం లేదా సాయంత్రం ఏదైనా రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి. శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) కొలువై ఉంటారు. ఇక్కడ దీపం వెలిగించడం వల్ల జీవితంలోని పెద్దపెద్ద సంక్షోభాలు కూడా తొలగిపోతాయి.
దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
{{/usCountry}}ఏకాదశి రోజు ఉదయం లేదా సాయంత్రం ఏదైనా రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి. శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) కొలువై ఉంటారు. ఇక్కడ దీపం వెలిగించడం వల్ల జీవితంలోని పెద్దపెద్ద సంక్షోభాలు కూడా తొలగిపోతాయి.
దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
{{/usCountry}}దీపం వెలిగించేటప్పుడు వత్తి కోసం ఎరుపు రంగు దారం లేదా స్వచ్ఛమైన పత్తి వత్తిని ఉపయోగించడం అత్యంత శ్రేయస్కరం.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి దీపంలో కొన్ని యాలకులు లేదా గులాబీ రేకులను వేయవచ్చు.
వెలుగుతున్న దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై పెట్టకూడదు. దీపం కింద కొద్దిగా బియ్యం, నల్ల నువ్వులు లేదా పూల రేకులతో ఆసనం ఏర్పాటు చేసి, దానిపై దీపాన్ని ఉంచాలి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.