ఈరోజు నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ప్రతి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సమయంలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈసారి వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి? తేదీలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అసలు వారాహి దేవి ఎవరు?

వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరుగా చెప్పబడుతుంది. ఆమె శక్తి స్వరూపిణి, శత్రుసంహారిణి, భక్తులను కాపాడే దైవంగా ఆరాధించబడుతుంది. వారాహి దేవికి లలితా త్రిపురసుందరీ దేవి సేనాధిపతిగా కూడా ప్రత్యేక స్థానం ఉంది.
వారాహి నవరాత్రులు 2026
వారాహి నవరాత్రులు జూలై 15, బుధవారం (ఈరోజు) నుంచి ప్రారంభమై, జూలై 23, గురువారం వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజూ అమ్మవారికి హోమం, అభిషేకం నిర్వహిస్తారు. తమ కోరికలు నెరవేరాలని, అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు కలగాలని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత వారాహి అమ్మవారిని ఆరాధించడం విశేషంగా భావిస్తారు. అయితే, వారాహిని ప్రధాన దేవతగా భావించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు కాలాల్లో కూడా ఈ నవరాత్రుల సమయంలో పూజించవచ్చు.
వారాహి నవరాత్రుల్లో ఏ రోజు ఏ రూపాన్ని పూజించాలి?
జూలై 15, బుధవారం – లలిత వారాహి దేవి
జూలై 16, గురువారం – అశ్వారూఢ వారాహి దేవి
జూలై 17, శుక్రవారం – గజారూఢ వారాహి దేవి
జూలై 18, శనివారం – శ్రీ స్వప్న వారాహి దేవి
జూలై 19, ఆదివారం – పంచమి వారాహి దేవి
జూలై 20, సోమవారం – సింహవాహన వారాహి దేవి
జూలై 21, మంగళవారం – కుక్కుటవాహన వారాహి దేవి
జూలై 22, బుధవారం – కనకదుర్గ వారాహి దేవి
జూలై 23, గురువారం – రాజరాజేశ్వరి లేదా మహిషాసురమర్దిని వారాహి దేవి
వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి?
వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శత్రు భయాలు తొలగిపోతాయని విశ్వాసం. శత్రువులపై విజయాన్ని సాధించే శక్తి లభిస్తుందని చెబుతారు.
{{/usCountry}}వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శత్రు భయాలు తొలగిపోతాయని విశ్వాసం. శత్రువులపై విజయాన్ని సాధించే శక్తి లభిస్తుందని చెబుతారు.
{{/usCountry}}అలాగే కోర్టు కేసులతో బాధపడుతున్న వారు అమ్మవారిని ఆరాధించడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నమ్మకం.
కుటుంబ కలహాలు తొలగి ఇంట్లో శాంతి నెలకొంటుందని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కూడా ఈ నవరాత్రులను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.
అదే విధంగా దుష్టశక్తులు, చెడు ప్రభావాల నుంచి రక్షణ కలగాలంటే ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు.
వారాహి నవరాత్రుల సమయంలో పాటించాల్సిన నియమాలు
వారాహి నవరాత్రుల సమయంలో మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి.
కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి. నిర్మలమైన మనసుతో పూజలు చేయాలి.
నవరాత్రుల చివరి రోజు కుమారి పూజ, సుహాసిని పూజలు చేసుకుంటే మంచిది.
పెద్దవారిని దూషించడం, ఇంట్లో గొడవలు పడడం వంటి వాటికి దూరంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచి వారాహి అమ్మవారిని ఏకాగ్రతతో ఆరాధించాలి.
భక్తిశ్రద్ధలతో వారాహి అమ్మవారిని కొలిస్తే శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా పొందవచ్చని విశ్వాసం.
జపించాల్సిన మంత్రం
ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః అనే ఈ బీజ మంత్రాన్ని జపిస్తే మంచిది.