ఈ రోజూవారీ అలవాట్లు మానుకోకుంటే అదృష్టం మీ వైపు కన్నెత్తి కూడా చూడదు!
విష్ణు పురాణం మానవ జీవితంలోని ఒడిదుడుకుల గురించి చెబుతుంది. అలాగే మనిషి కొన్ని అలవాట్లను అత్యంత చెడ్డ అలవాట్లుగా వర్ణిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం, మన అలవాట్లలో అత్యంత చెడ్డవి ఏవి? మీకు కూడా ఈ అలవాట్లు ఉంటే ఈరోజే మానేయండి.
మన కొన్ని అలవాట్లు మనకు దురదృష్టాన్ని తెస్తాయి. ఈ అలవాట్లు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులను పొందకుండా మనల్ని అడ్డుకుంటాయి. దీని కారణంగా ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను ఎదుర్కొంటాడు. లక్ష్మీదేవి మనపై అనుగ్రహం పొందాలంటే.. మనం ముందుగా కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. విష్ణు పురాణం ప్రకారం, ఒక వ్యక్తి రోజువారీ అలవాట్లు, మాట్లాడే మాటలే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తిని దురదృష్టవంతుడిని చేసే, రోజూ పాటించే అలవాట్లు ఏంటో విష్ణు పురాణంలో ఉంది. మనం అటువంటి అలవాట్లను వెంటనే మార్చుకోవాలి.

తల గోకడం
విష్ణు పురాణం ప్రకారం.. నిలబడి ఉన్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు తల గోకడం అశుభంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా, అనవసరంగా పదేపదే తల గోకడం ప్రారంభిస్తే, ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. అలా చేయడం నిర్ణయరాహిత్యానికి సంకేతమని నమ్ముతారు. ఈ అలవాటు వల్ల లక్ష్మీదేవి కోపించి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా.. తల గోకే అలవాటు జీవితంలో దుఃఖాలకు దారితీస్తుందని చెబుతారు. అందుకే అనవసరంగా తల గోకడం అశుభంగా చెబుతుంటారు. దీనివల్ల ధన నష్టం కూడా జరగవచ్చు.
తలపై చేతులు
ఈ చెడు అలవాటును మనం చాలా మందిలో చూడవచ్చు. సాధారణంగా కూర్చున్నప్పుడు అనవసరంగా రెండు చేతులు లేదా ఒక చేతిని తలపై పెట్టుకుంటారు. కేవలం తలపై చేతులు పెట్టుకుని కూర్చోవడమే కాకుండా.. ఏదో ఒక విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ కూడా ఉంటారు. సాధారణంగా మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ తప్పు చేస్తాం. విష్ణు పురాణంలో ఇది ఒక తప్పుగా చెప్పారు. అంతేకాదు.. ఇది ఏదైనా ఆపదకు సంకేతం కూడా కావచ్చు. ఈ చెడు అలవాటు మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిని వెంటనే మార్చుకోవాలి.
గోళ్లు కొరకడం
మీరు కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు తరచుగా గోళ్లు కొరుకుతుంటే.. అటువంటి అలవాటును మంచి అలవాటు అని అనలేం. దీనిని చెడు అలవాటుగా పరిగణిస్తారు. ఈ తప్పు చేయడం మీ జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. పదేపదే గోళ్లు కొరికే అలవాటు మీ పనిలో రకరకాల అడ్డంకులను సృష్టిస్తుందని లేదా మీరు ఆర్థిక రంగంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు. అలాగే ఆరోగ్య దృష్ట్యా కూడా గోళ్లు కొరికే అలవాటును అశుభంగా భావిస్తారు. దీని కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు.
కాళ్లు ఊపడం
కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచి అలవాటుగా పరిగణించరు. ఈ తప్పు చేస్తే, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కోపగించుకుంటుందని నమ్ముతారు. లక్ష్మీదేవి కోపం వల్ల ఒక వ్యక్తి ఆర్థిక, వాణిజ్య రంగాలలో సమస్యలు, అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. కాళ్లు ఊపే అలవాటు మన గ్రహాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటారు. ఇది వ్యక్తి జాతకంలో చంద్రుని స్థానాన్ని బలహీనపరుస్తుందని నమ్ముతారు. ఒక వ్యక్తి మానసిక ఒత్తిడిని అనుభవించవలసి రావచ్చు. కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే చెడు అలవాటును వదిలివేయడం మంచిది.
వేళ్లు కలిపి పట్టుకోవడం
శాస్త్రాల ప్రకారం రోజువారీ జీవితంలో మీ వేళ్లు పదే పదే కలిపి పట్టుకోవడం ఒక చెడు అలవాటుగా పరిగణిస్తారు. చాలా మంది ఇలాంటి సమయంలో వేళ్లు విరుచుకుంటారు. ఇలా చేయడం శని దోషానికి కారణం. ఈ అలవాటు మనల్ని శని దేవుని ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనేలా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురికావచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


