...
...
Next Story

వివాహం, సంతాన, ఆర్థిక సమస్యలా? శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!

కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, మూడవది నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళుతూ ఉంటారు.

Published on: Nov 25, 2025, 08:00:06 IST
Advertisement

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం పూజలు చేయడం, పరిహారాలను పాటించడం, ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. నాగ, సర్ప దోషాలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ దోషాల నుంచి బయటపడడానికి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రఖ్యాత కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం.

కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (pinterest)
కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (pinterest)

రెండవది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, మూడవది నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఇవి మూడు కూడా కర్ణాటకలో వెలసిన అద్భుతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు. మరో విషయం ఏంటంటే, ఈ మూడు ఆలయాలని కలిపితే సర్పాకారం వస్తుంది. ఇక ఈరోజు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

కుజదోష పూజలు

కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సర్ప దోష పూజల్లో ముఖ్యమైన ఆశ్లేష బలి, సర్ప సంస్కారాలు వంటివి చేస్తే నాగ దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాల నుంచి బయటపడొచ్చు. ప్రతి ఏటా శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉంటుంది. విశేషమైన రోజుల్లో మాత్రం భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది.

అద్భుతమైన సుబ్రహ్మణ్య విగ్రహం

గరుడ స్తంభం మొట్టమొదట ఉంటుంది. ఆ తర్వాత బాహ్య, అంతరాల సుబ్రహ్మణ్య మండపాలు ఉంటాయి. ఆలయం మధ్యలో ఒక ఎత్తైన పీఠం ఉంటుంది. ఆ పీఠం పైభాగంలో సుబ్రహ్మణ్య, వాసుకిల విగ్రహాలు ఉంటాయి. కింద భాగంలో ఆరు తలలు ఉన్న శేషనాగ విగ్రహం కనబడుతుంది. రోజూ ఇక్కడ శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు.

సుబ్రహ్మణ్య దర్శనానికి ముందు పవిత్ర ధారా నదిలో స్నానం చేయాలి. ఆ తర్వాత దర్శనానికి వెళ్లాలి. స్వామి దర్శనానికి ఆలయ వెనుక తలుపు నుంచి ఆలయంలోకి చేరుకుని మూలవిరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.

ఆలయం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి?

ఈ ఆలయం పశ్చిమ కనుమల్లో, దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం ధారా నది తీరాన ఉంది. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోతాయని నమ్మకం. స్వామి పడగ విప్పి కాపు కాస్తున్న ఆరు సర్పకాల నాగుల్లాగా దర్శనమిస్తారు. ఈ కుక్కే గ్రామంలో ఉన్న పురాతన ఆలయాన్ని బెంగళూరు, చిక్ మంగుళూరు నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో రావచ్చు.

ఈ ఆలయానికి వెళ్తే ఈ సమస్యలు తీరిపోతాయి

కొంత మందికి పెళ్లి ఆలస్యం అవ్వడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, సర్ప దోషాలు వంటివి ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks