భరణి నక్షత్రంలోకి కుజుడు - ఈ 3 రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..!
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సేనాధిపతిగా భావించే అంగారకుడు మే 29న భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి నక్షత్రంలో మంగళుడి సంచారం కారణంగా మూడు రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. జూన్ 16 వరకు వీరికి అఖండ ధనలాభం, కెరీర్లో భారీ విజయాలు దక్కనున్నాయి.
Mars Transit Bharani Nakshatra 2026 : నవగ్రహాలలో కమాండర్గా, ధైర్యసాహసాలకు సంకేతంగా భావించే అంగారకుడు (కుజుడు) తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పు అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మార్పు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రస్తుతం అంగారక గ్రహం మేష రాశిలో ఉంటూ అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే…. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 29, 2026 శుక్రవారం ఉదయం 06:34 గంటలకు కుజుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.
భరణి నక్షత్రానికి అధిపతిగా సంపద, వైభోగాలను ఇచ్చే శుక్రుడిని పరిగణిస్తారు. అగ్ని తత్వానికి చిహ్నమైన అంగారకుడు, విలాసాల అధిపతి అయిన శుక్రుడి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ప్రత్యేకమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి.
ఈ సంచారం జూన్ 16వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ 18 రోజుల పాటు శుక్రుడి నక్షత్రంలో అంగారకుడి ఉనికి ఏ ఏ రాశుల వారికి అదృష్టాన్ని, విపరీతమైన ధనలాభాలను తెచ్చిపెట్టబోతుందో ఇక్కడ తెలుసుకోండి…
మేష రాశి :
భరణి నక్షత్రంలో అంగారకుడి సంచారం మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. కుజుడు మేష రాశిలోనే ఉంటూ ఈ నక్షత్ర మార్పును చేస్తుండటం వల్ల ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి.
- ఆర్థిక లాభాలు : ఈ సమయంలో మీరు ఊహించని మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
- కెరీర్ - విద్య : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో అద్భుతమైన శుభవార్తలు వింటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
- వ్యక్తిగత జీవితం : ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం చాలా ఆనందంగా సాగుతుంది. భాగస్వామితో పరస్పర బంధం బలపడుతుంది, ఇద్దరూ కలిసి మంచి సమయాన్ని గడుపుతారు.
తులా రాశి :
తులా రాశి వారికి శుక్రుడి భరణి నక్షత్రంలో అంగారకుడి ప్రవేశం ఊహించని మార్పులను తీసుకువస్తుంది. ఈ రాశికి అధిపతి స్వయంగా శుక్రుడు కావడంతో కుజుడి సంచారం వీరికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది.
- ఆత్మవిశ్వాసం : మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఎలాంటి కఠినమైన నిర్ణయాలనైనా ధైర్యంగా తీసుకుని విజయం సాధిస్తారు.
- ధనలాభం : మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. వ్యాపారాల్లో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, సామాజిక హోదా గణనీయంగా పెరుగుతాయి.
- కుటుంబం : వైవాహిక జీవితం ఎంతో శృంగారభరితంగా, ఆహ్లాదకరంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి ప్రజలకు భరణి నక్షత్రంలో కుజుడి ప్రయాణం అద్భుతమైన రోజులను తీసుకువస్తుంది. మీ కలలు నిజం చేసుకునేందుకు ఈ సమయం అండగా నిలుస్తుంది.
- కెరీర్ - వ్యాపారం : ఉద్యోగస్తులకు ఆఫీసులో స్నేహితులు, సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి, లాభాల బాట పడతారు.
- ఆస్తి, వాహన యోగం : చాలా కాలంగా కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలనుకునే వారి కల ఈ కాలంలో నెరవేరే అవకాశం ఉంది. వాహన కొనుగోలుకు యోగం పడుతుంది.
- ఆనందం : కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక లేదా విహార యాత్రలకు వెళ్లే ప్రణాళికలు రూపుదాల్చుతాయి. దీనివల్ల కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

