కర్కాటకంలోకి బుధుడు - ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! వీరికి మాత్రం సవాళ్లు
బుధ గ్రహం జూన్ 22న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం… ఈ బుధ సంచారం కొన్ని రాశుల వారికి అద్భుత లాభాలను, మరికొన్ని రాశుల వారికి శని ప్రభావం కంటే కఠినమైన సవాళ్లను తీసుకురానుంది.
నవగ్రహాలలో బుద్ధి, వ్యాపార కారకుడైన బుధ గ్రహం తన రాశిని మార్చుకున్నాడు. జూన్ 22న బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. వైదిక జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, ప్రసంగం, వ్యాపార దక్షత, తార్కిక ఆలోచనా శక్తి మరియు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థకు చిహ్నంగా పండితులు భావిస్తారు. బుధుడు జరిపే ఈ రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై, ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య, మానసిక విషయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అందించిన వివరాల ప్రకారం…. ఈ బుధ గోచారం కొన్ని రాశుల వారికి అమృతోపమానమైన సానుకూల ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారిని మాత్రం తీవ్రమైన సవాళ్లలోకి నెట్టేస్తోంది.
ఈ 4 రాశుల వారికి అదృష్టం.. !
బుధుడి కర్కాటక రాశి ప్రవేశం వల్ల వృషభ రాశి, కన్యా రాశి, తులా రాశి మరియు మకర రాశి ప్రజలకు అద్భుతమైన కాలం ప్రారంభమైందని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఈ నాలుగు రాశుల వారికి బుధ సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరు చేపట్టే పనులలో పనితీరు మెరుగవుతుంది. వినూత్న ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడం వల్ల ఆర్థికంగా, వృత్తిపరంగా అపారమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి.
బుధుడు ఏ రాశిలోకైతే ప్రవేశించాడో, ఆ కర్కాటక రాశి వారికి మాత్రం ఈ సమయం అస్సలు అనుకూలంగా లేదు. కర్కాటకంలో బుధుడి స్థానాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ సంచారం వల్ల కలిగే నష్టాలు చాలా సందర్భాలలో శని దేవుడి ఇచ్చే తీవ్రమైన హానికరమైన ప్రభావం కంటే ఎక్కువగా ఉంటాయని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ హెచ్చరించారు. కర్కాటక రాశిలో బుధుడు కొన్నిసార్లు శని కంటే ఎక్కువ అశుభ ఫలితాలను ఇస్తాడనే నమ్మకం ఉంది. అందుకే ఈ రాశిలో బుధుడిని అరిష్టంగా పిలుస్తారు.
“బుధుడు యొక్క ఈ సంచారం కర్కాటక రాశి వారికి తీవ్ర అరిష్టాన్ని కలిగిస్తుంది. చాలా సార్లు శని కూడా ఇంత హానికరమైన ప్రభావాన్ని చూపడు. కర్కాటక రాశి ఉన్నవారు ముఖ్యంగా నాడీ వ్యవస్థ, చర్మం, పెదవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీటితో పాటు ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. మానసిక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి” అని పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. కర్కాటక రాశికి బుధుడు మూడవ మరియు పన్నెండవ స్థానాలకు అధిపతి కావడంతో… ఇది ఊహించిన దానికంటే ఎక్కువ సవాలుతో కూడిన ఫలితాలను ఇస్తుందని ఆయన విశ్లేషించారు.
వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి!
పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ లెక్కల ప్రకారం.. కర్కాటక రాశితో పాటు సింహ రాశి మరియు కుంభ రాశి ప్రజలు కూడా ఈ బుధ గోచార సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలు ఇలా ఉన్నాయి:
- కుటుంబంలో చిన్నచిన్న విషయాలకే విభేదాలు తలెత్తి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది.
- అనవసరమైన ఖర్చులు పెరగడం వల్ల తీవ్ర ఆర్థిక ఒట్టిడికి లోనవుతారు.
- చేతిలో డబ్బు నిలవక, అత్యవసరాల కోసం ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన లేదా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
- కెరీర్ మరియు ఉద్యోగ రంగంలో పనిభారం అమాంతం పెరుగుతుంది, దీనివల్ల శారీరక శ్రమ ఎక్కువవుతుంది.
- ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా కొత్తగా ప్రారంభించే వ్యాపారాలలో ఊహించని నష్టాలు వాటిల్లుతాయి. కాబట్టి ఈ రాశుల వారు ప్రతి రూపాయిని చాలా తెలివిగా, ఆలోచించి ఖర్చు చేయడం మంచిది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

