...
...
Next Story

Mercury Transit 2026 : మృగశిర నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి ఈ 4 రాశుల వారికి కాసుల వర్షం!

Mercury Transit Mrigasira Nakshatra 2026 : గ్రహాల యువరాజు బుధుడు మే 25న మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడి నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల వృషభం, సింహం సహా నాలుగు రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు కలగనున్నాయి.

Published on: May 25, 2026, 07:09:02 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

Mercury Transit Mrigasira Nakshatra 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల యువరాజుగా, బుద్ధి కారకుడిగా భావించే బుధ గ్రహ నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తాజాగా బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). అంగారకుడికి చెందిన ఈ నక్షత్రంలోకి జ్ఞానం, వ్యాపారం, తర్కం, కమ్యూనికేషన్‌కు కారకుడైన బుధుడు ప్రయాణించినప్పుడు మానవ జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.

మృగశిర నక్షత్రంలోకి బుధుడు
మృగశిర నక్షత్రంలోకి బుధుడు

హిందూ పంచాంగం ప్రకారం….. మే 25వ తేదీ సోమవారం రాత్రి 11:49 గంటలకు బుధుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 1వ తేదీ వరకు ఆయన ఇదే నక్షత్రంలో కొనసాగుతారు. కుజుడికి ఉన్న శక్తి, బుధుడికి ఉన్న జ్ఞానం.. ఈ రెండింటి కలయికతో ఏర్పడే ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారికి వరంగా మారబోతోంది. ఈ నక్షత్ర పరివర్తనం కారణంగా ప్రధానంగా నాలుగు రాశుల వారి జీవితంలో సంపద, పురోగతి, సంతోషాల వర్షం కురవనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే….

వృషభ రాశి : రెట్టింపు లాభాలు, కెరీర్‌లో ఊపు

మృగశిర నక్షత్రంలో బుధుడి సంచారం వృషభ రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారబోతోంది. నేటి నుంచి జూన్ 1 వరకు ఉన్న సమయం వీరికి ఎంతో సృజనాత్మకంగా, అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని విధంగా బంపర్ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఆశించిన దానికంటే రెట్టింపు రాబడిని పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పాత డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పదోన్నతితో పాటు పెద్ద బాధ్యతలు దక్కుతాయి. మీ మాటల చాతుర్యం ఈ సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలను చాలా సులభంగా ఖరారు చేసుకోగలుగుతారు.

సింహ రాశి: సామాజిక గౌరవం, ఆకస్మిక ధనలాభం

కన్యా రాశికి బుధుడే అధిపతి కావడం వల్ల, ఈ నక్షత్ర సంచార ప్రభావం మీ వ్యక్తిత్వంపై, వృత్తి జీవితంపై అత్యంత సానుకూలంగా కనిపిస్తుంది. మీకు అదృష్టం పూర్తి స్థాయిలో కలిసివస్తుంది. సరైన సపోర్ట్ లేక గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం లభించడమే కాకుండా, పెద్ద కంపెనీల నుండి ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఆఫర్లు వస్తాయి. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి, గందరగోళం నుండి ఉపశమనం పొందుతారు. మీలో కొత్త ఉత్సాహం, ఏకాగ్రత పెరుగుతాయి.

కుంభ రాశి: విద్యార్థులకు సక్సెస్, ఆదాయ వృద్ధి

కుంభ రాశి వారికి ఈ సంచారం విద్య, ప్రేమ, సంతాన పరంగా గొప్ప శుభవార్తలను మోసుకొస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో అద్భుతమైన విజయాన్ని లేదా ఉద్యోగ సమాచారాన్ని అందుకుంటారు. మీ ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు రావడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా బలపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి బంధం మరింత మధురంగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe