...
...
Next Story

శని రాశిలోకి రాహువు - ఈ 3 రాశుల వారికి డిసెంబర్ నుంచి గోల్డెన్ డేస్..!

డిసెంబర్ 5న శని పాలిత మకర రాశిలోకి రాహువు ప్రవేశించనున్నాడు. ఈ కీలక గ్రహ మార్పుతో ఏ 3 రాశుల వారి జాతకం మారనుంది.

Published on: Sep 15, 2026, 13:17:41 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువుల గ్రహ స్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా రాహువు, శని పేర్లు వినగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే ప్రతీసారి ఇవి ప్రతికూల ఫలితాలనే ఇవ్వవు. సరైన స్థానాల్లో సంచరించినప్పుడు మానసిక, ఆర్థిక జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులను, విశేష పురోగతిని తీసుకువస్తాయి. రాబోయే డిసెంబర్ నెలలో రాహువు, శనుల కలయిక ప్రాధాన్యత సంతరించుకోనుంది.

శని రాశిలోకి రాహువు
శని రాశిలోకి రాహువు

జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం,,,.. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ 5వ తేదీ రాత్రి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరం శని దేవునికి చెందిన రాశి కావడం వల్ల ఈ గ్రహ పరివర్తనపై శని దేవుని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శని రాశిలోకి రాహువు రాక మూడు రాశుల వారి జాతకాలను సానుకూలంగా మార్చబోతోంది. ముఖ్యంగా సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ గ్రహ సంచారం విశేష ప్రయోజనాలను అందించనుంది.

1. సింహ రాశి

మకర రాశిలో రాహువు సంచారం సింహ రాశి వారికి సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆశించిన అవకాశాలు, పదోన్నతులు ఇప్పుడు లభిస్తాయి. మీ కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం లభించడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉన్న అయోమయం, గందరగోళం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు ఆశించిన ప్రతిఫలం అందుతుంది.

2. వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సంచారం వల్ల నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ ముందుకు సాగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఎక్కువ కాలంగా మీరు చేస్తున్న శ్రమకు తగిన మంచి ఫలితాలు అందుతాయి. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. చేపట్టే పనుల్లో విజయాలు లభించడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నిలకడగా వ్యవహరించడం మంచిది.

3. మీన రాశి

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks