హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. సకల జగద్రక్షకుడైన శ్రీమహావిష్ణువుకు అంకితం చేసిన ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయని, అంతిమంగా మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తుండగా, ప్రతి నెలా రెండు సార్లు ఈ వ్రతాలు ఆచరించే అవకాశం లభిస్తుంది. తెలుగు సంప్రదాయంలో దీనిని 'ఏకాదశి' అని పిలుస్తారు. ఇక రాబోయే సెప్టెంబర్ నెలలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే 'అజ ఏకాదశి', 'పరివర్తిని ఏకాదశి' వ్రతాలు రానున్నాయి. ఈ రెండు పవిత్ర వ్రతాల కచ్చితమైన తేదీలు, ముహూర్తాల వివరాలు ఇలా ఉన్నాయి.
అజ ఏకాదశి 2026: తేదీ మరియు ముహూర్తం

ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణ పక్షం రోజు వచ్చే ఏకాదశినే 'అజ ఏకాదశి'గా పరిగణిస్తారు. పంచాంగ గణన ప్రకారం.. సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 07:29 గంటలకు ప్రారంభమయ్యే ఏకాదశి తిథి, సెప్టెంబర్ 7న సాయంత్రం 05:03 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రామాణికతను బట్టి భక్తులు సెప్టెంబర్ 7, 2026 సోమవారం రోజున అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు.
అజ ఏకాదశి వ్రత విరమణ సమయం
అజా ఏకాదశి వ్రతం పూర్తి చేసుకున్న వారు సెప్టెంబర్ 8, 2026న ద్వాదశి రోజున విరమణ చేస్తారు. ఆ రోజు ఉదయం 07:17 నిమిషాల నుంచి ఉదయం 09:53 నిమిషాల మధ్య వ్రత విరమణ చేయడానికి అత్యంత అనుకూలమైన శుభ ముహూర్తం ఉంది. ఇక ద్వాదశి తిథి సెప్టెంబర్ 8న ఉదయం 11:12 గంటలకు ముగుస్తుంది.
అజ ఏకాదశి విశిష్టత
పురాణాల ప్రకారం, అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి జన్మజన్మల పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వేలాది అశ్వమేధ యాగాలతో పాటు రాజసూయ యాగం చేసినంత మహోన్నత పుణ్యఫలం ఈ వ్రతం ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా, ఈ పవిత్ర దినాన శ్రీహరిని స్మరించడం వల్ల కుటుంబంలో సుఖసౌభాగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
పరివర్తిని ఏకాదశి 2026 ఎప్పుడు?
సెప్టెంబర్ నెలలో రానున్న రెండవ పవిత్ర వ్రతం 'పరివర్తిని ఏకాదశి'. భాద్రపద మాసంలో శుక్ల పక్షం రోజు వచ్చే ఈ ఏకాదశిని 'పరివర్తిని ఏకాదశి' లేదా 'పద్మ ఏకాదశి' అని కూడా పిలుస్తారు. పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 21, 2026న సాయంత్రం 04:30 గంటలకు ప్రారంభమయ్యే ఏకాదశి తిథి, సెప్టెంబర్ 22 సాయంత్రం 06:13 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 22, 2026 మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి.
పరివర్తిని ఏకాదశి వ్రత విరమణ సమయం
{{/usCountry}}సెప్టెంబర్ నెలలో రానున్న రెండవ పవిత్ర వ్రతం 'పరివర్తిని ఏకాదశి'. భాద్రపద మాసంలో శుక్ల పక్షం రోజు వచ్చే ఈ ఏకాదశిని 'పరివర్తిని ఏకాదశి' లేదా 'పద్మ ఏకాదశి' అని కూడా పిలుస్తారు. పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 21, 2026న సాయంత్రం 04:30 గంటలకు ప్రారంభమయ్యే ఏకాదశి తిథి, సెప్టెంబర్ 22 సాయంత్రం 06:13 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 22, 2026 మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి.
పరివర్తిని ఏకాదశి వ్రత విరమణ సమయం
{{/usCountry}}ఈ వ్రతాన్ని ఆచరించిన భక్తులు సెప్టెంబర్ 23వ తేదీన ఉదయం 07:38 నిమిషాల నుంచి ఉదయం 10:04 నిమిషాల మధ్య కాలంలో ఆహారాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి. ఆ రోజు ద్వాదశి తిథి సాయంత్రం 07:20 గంటలకు ముగుస్తుంది.
పరివర్తిని ఏకాదశి ప్రాముఖ్యత
ఈ పవిత్ర రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో తన మంచాన్ని లేదా భంగిమను మారుస్తాడని అందుకే దీనిని 'పరివర్తినీ ఏకాదశి' అంటారని విశ్వసిస్తారు. ఈ రోజున భగవానుడి వామన అవతారాన్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ వ్రత ప్రభావం వల్ల సకల పాపాలు హరించుకుపోయి మోక్షం సిద్ధిస్తుంది. త్రిలోకాలను పూజించినంతటి పుణ్యఫలంతో పాటు, వాపేయ యాగం చేసినంతటి గొప్ప ఫలితం దక్కుతుందని, జీవితం సుఖసంతోషాలతో కళకళలాడుతుందని పండితులు చెబుతున్నారు.