...
...
Next Story

ఆగస్టు 20న శని నక్షత్ర పద మార్పు - ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే..!

ఆగస్టు 20, 2026న శని దేవుడు రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. తిరోగమనంలో ఉన్న శని నక్షత్ర మార్పు వల్ల 4 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

Published on: Aug 15, 2026, 16:54:35 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మనుషులు చేసే కర్మాచరణను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయాధిపతిగా, ధర్మకర్తగా శని గ్రహాన్ని భావిస్తారు. నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా సంచరించే శని దేవుడు తన కదలికను లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపైనా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మీన రాశిలో కొలువుదీరిన శని దేవుడు, త్వరలోనే తన నక్షత్ర స్థానాన్ని మార్చుకోబోతున్నాడు.

ఆగస్టు 20న శని నక్షత్ర పద మార్పు - ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే..!
ఆగస్టు 20న శని నక్షత్ర పద మార్పు - ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే..!

ప్రస్తుతం రేవతి నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్న శని, తిరోగమన స్థితిలో ఉండటం వల్ల వెనుకకు పయనిస్తూ రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం ఆగస్టు 20, 2026 నాడు రాత్రి 7:45 గంటలకు శని దేవుని ఈ నక్షత్ర పద మార్పు జరగనుంది. ఈ మార్పు వల్ల ఆగస్టు 20 నుంచి నాలుగు రాశుల వారి జీవితాల్లో కష్టాలు తొలగిపోయి, సంతోషం మరియు ఆర్థిక ప్రయోజనాలు సమకూరనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

మిథున రాశి :

శని నక్షత్ర పద మార్పు మిథున రాశి జాతకులకు ఎంతో మేలు చేస్తుంది.వృత్తిపరమైన జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడానికి అనుకూలమైన అవకాశాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న చట్టపరమైన వివాదాలు లేదా సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలను ఇచ్చే కొత్త ఒప్పందాలు కుదురుతాయి.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి శని నక్షత్ర మార్పు తీవ్ర సానుకూల ఫలితాలను ఇస్తుంది. చదువుకునే విద్యార్థులకు పోటీ పరీక్షలు మరియు విద్యకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. మీరు తలపెట్టిన ప్రతి పనిని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసి విజయవంతం అవుతారు. వ్యాపార రంగానికి చెందిన వారి శ్రమకు తగిన ప్రశంసలు మరియు సమాజంలో గుర్తింపు లభిస్తాయి.

తులారాశి :

వృషభ రాశి వారికి శని దేవుడి నక్షత్ర స్థాన మార్పు గొప్ప శుభవార్తలను మోసుకొస్తుంది.జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి.మీ ప్రేమ జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, ఇద్దరూ ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe