...
...
Next Story

Shivaratri 2026: మహాశివరాత్రి వేళ శివుడికి వేటితో అభిషేకం చేయాలి? ఇలా చేస్తే ఐశ్వర్యం, సర్వసుఖాలు, సంతాన ప్రాప్తి!

ఈ ఏడాది ఫిబ్రవరి 15, అనగా ఈరోజు, శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజు పరమేశ్వరుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. అలాగే శివార్చన, శివాభిషేకంతో కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి విశిష్టత ఉంది. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం.

Published on: Feb 15, 2026, 07:09:46 IST
Advertisement

ఈ రోజే మహాశివరాత్రి. శివరాత్రిని అడుగు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడు బ్రహ్మరూపం నుంచి లింగరూపంలోకి అవతరించిన ఈ రోజునే శివరాత్రి అంటారు. శివ పురాణం ప్రకారం చూసినట్లయితే, శివుడు పార్వతీదేవితో వివాహం జరిగిన రోజు కూడా ఈ విశేష రోజునే.

శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి (pinterest)
శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి (pinterest)

ఈ ఏడాది ఫిబ్రవరి 15, అనగా ఈరోజు, శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజు పరమేశ్వరుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. అలాగే శివార్చన, శివాభిషేకంతో కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి విశిష్టత ఉంది. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం.

శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి

శివుడికి అన్నాభిషేకం చేయడం వలన సుఖ జీవనం పొందవచ్చు.

ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది.

నారికేళ జలంతో అభిషేకం చేయడం వలన సర్వసంపద వృద్ధి చెందుతుంది, ఆనందంగా ఉండొచ్చు.

ఖర్జూర రసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రు నాశనం జరుగుతుంది.

గరిక జలంతో శివుడికి అభిషేకం చేయడం వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.

ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది.

ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి.

ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం కలుగుతాయి; సంతాన ప్రాప్తి పొందవచ్చు.

చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే దుఃఖాలు తొలగి పోతాయి.

భస్మజలంతో అభిషేకం చేయడం వలన పాపాలన్నీ తొలగి పోతాయి, ఆనందంగా ఉండొచ్చు.

పుష్పోదకంతో అభిషేకం చేయడం వలన స్థిరాస్తి పెరుగుతుంది.

సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్ర సంతోషం ఉంటుంది.

శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి

బిల్వజలంతో అభిషేకం చేయడం వలన ఆనందాన్ని పొందవచ్చు.

నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యుదోషం తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

నవరత్న జలంతో అభిషేకం చేస్తే గృహప్రాప్తి కలుగుతుంది.

రుద్రాక్ష శోధక జలంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది.

మామిడి రసంతో అభిషేకం చేస్తే వ్యాధులన్నీ తొలగి పోతాయి.

పసుపు, కుంకుమలతో అభిషేకం చేయడం మంగళప్రదం.

విభూదితో అభిషేకం చేస్తే కోటిరెట్లు ఫలితం పొందవచ్చు.

సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగిపోతుంది.

గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వసమృద్ధి, సంపద కలుగుతాయి.

కస్తూరి జలంతో అభిషేకం చేస్తే రాజసం పెరుగుతుంది.

నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం వలన నిరాశ తొలగి పోతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe