ఈ రోజే మహాశివరాత్రి. శివరాత్రిని అడుగు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడు బ్రహ్మరూపం నుంచి లింగరూపంలోకి అవతరించిన ఈ రోజునే శివరాత్రి అంటారు. శివ పురాణం ప్రకారం చూసినట్లయితే, శివుడు పార్వతీదేవితో వివాహం జరిగిన రోజు కూడా ఈ విశేష రోజునే.

ఈ ఏడాది ఫిబ్రవరి 15, అనగా ఈరోజు, శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజు పరమేశ్వరుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. అలాగే శివార్చన, శివాభిషేకంతో కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి విశిష్టత ఉంది. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం.
శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి
శివుడికి అన్నాభిషేకం చేయడం వలన సుఖ జీవనం పొందవచ్చు.
ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది.
నారికేళ జలంతో అభిషేకం చేయడం వలన సర్వసంపద వృద్ధి చెందుతుంది, ఆనందంగా ఉండొచ్చు.
ఖర్జూర రసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రు నాశనం జరుగుతుంది.
గరిక జలంతో శివుడికి అభిషేకం చేయడం వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.
ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది.
ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి.
ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం కలుగుతాయి; సంతాన ప్రాప్తి పొందవచ్చు.
చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే దుఃఖాలు తొలగి పోతాయి.
తేనెతో శివుడికి అభిషేకం చేయడం వలన తేజస్సు పెరుగుతుంది.
{{/usCountry}}తేనెతో శివుడికి అభిషేకం చేయడం వలన తేజస్సు పెరుగుతుంది.
{{/usCountry}}భస్మజలంతో అభిషేకం చేయడం వలన పాపాలన్నీ తొలగి పోతాయి, ఆనందంగా ఉండొచ్చు.
పుష్పోదకంతో అభిషేకం చేయడం వలన స్థిరాస్తి పెరుగుతుంది.
సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్ర సంతోషం ఉంటుంది.
బిల్వజలంతో అభిషేకం చేయడం వలన ఆనందాన్ని పొందవచ్చు.
నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యుదోషం తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
నవరత్న జలంతో అభిషేకం చేస్తే గృహప్రాప్తి కలుగుతుంది.
రుద్రాక్ష శోధక జలంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది.
మామిడి రసంతో అభిషేకం చేస్తే వ్యాధులన్నీ తొలగి పోతాయి.
పసుపు, కుంకుమలతో అభిషేకం చేయడం మంగళప్రదం.
విభూదితో అభిషేకం చేస్తే కోటిరెట్లు ఫలితం పొందవచ్చు.
సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగిపోతుంది.
గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వసమృద్ధి, సంపద కలుగుతాయి.
కస్తూరి జలంతో అభిషేకం చేస్తే రాజసం పెరుగుతుంది.
నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం వలన నిరాశ తొలగి పోతుంది.