శుక్రవారం నాడు ఈ ఐదు వస్తువులను గుమ్మం దగ్గర పెడితే దరిద్రం తొలగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!
చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజుకీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శుక్రవారం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు కొన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
శుక్రవారంనాడు కొన్ని పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ప్రతి రోజుకీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల్లో శుక్రవారం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు కొన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
శుక్రవారం నాడు ఈ ఐదు వస్తువులను గుమ్మం వద్ద పెడితే దరిద్రం తొలగిపోతుంది (pinterest)
శుక్రవారం నాడు వీటిని దానం చేస్తే చాలా మంచిది.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది
శుక్రవారం నాడు తీపి పదార్థాలను దానం చేయడం మంచిది. లక్ష్మీదేవితో పాటుగా శుక్ర గ్రహానికి కూడా ఈ శుక్రవారం ఎంతో ప్రత్యేకం. అలాగే తెల్లటి రంగులో ఉండే ఆహార పదార్థాలను దానం చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఎక్కువ అవుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కూడా వీలవుతుంది. శుక్రవారం నాడు సంపద పెరగాలంటే పంచదార, ఉప్పు, పెరుగు వంటి వాటిని దానం చేస్తే మంచిది. దీంతో సంపద పెరుగుతుంది, కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.
శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రీ యంత్రాన్ని ఆవుపాలతో కడిగి, ఆ తర్వాత యంత్రాన్ని డబ్బు ఉంచే చోట పెట్టాలి. ఇలా చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది, కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది.
దరిద్రం తొలగిపోవాలంటే శుక్రవారం నాడు గుమ్మం దగ్గర వీటిని పెట్టడం మంచిది
మామిడి తోరణం:
శుక్రవారం నాడు దరిద్రం తొలగిపోయి, ప్రతికూల శక్తి నుంచి బయట పడడానికి మామిడి ఆకులతో తోరణాన్ని కట్టండి. దీంతో ఇంటికి శుభశకునాలు ప్రవేశిస్తాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.
ఉప్పు పాత్ర:
శుక్రవారం నాడు ఉప్పుతో నిండిన ఒక చిన్న పాత్రను గుమ్మం దగ్గర పెట్టండి. దీంతో దృష్టిదోషం, చెడు శక్తులు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.
పసుపు నీరు, కర్పూరం:
గుమ్మం లోపల ఒక రాగి చెంబులో నీళ్లు పోసి, అందులో పసుపు, కర్పూరం, నాణెం వేయాలి. ఇలా చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. ఆనందంగా ఉండొచ్చు. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.
రావి ఆకుల తోరణం:
శుక్రవారం నాడు మామిడి ఆకుల తోరణం లాగే రావి ఆకులతో తోరణాన్ని కట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. దీనిని శుభ సూచకంగా భావిస్తారు.
మిరపకాయలు, నిమ్మకాయలు:
మిరపకాయలను శుక్రవారం నాడు గుమ్మం దగ్గర కట్టడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు.
కుంకుమతో స్వస్తిక్:
శుక్రవారం నాడు కుంకుమతో స్వస్తిక్ గుర్తును గుమ్మం పై వేయండి. దీంతో ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉండొచ్చు.