నేటి నుంచి ఈ రాశులకు ధన వర్షం.. శుక్రుడి కటాక్షంతో మీ ఇల్లు లక్ష్మీ నిలయమే!

జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదమైన గ్రహంగా భావించే శుక్రుడు, మే 8న తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల మే 19 వరకు ఐదు రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తిలో పురోగతి కలిగే అవకాశం ఉంది. మరి ఇక ఆ అదృష్ట ఎవరు? ఈ రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

Published on: May 8, 2026, 12:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం అంటేనే విలాసం, ప్రేమ, సంపదకు మూలకారకుడు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం రాజభోగాలతో విరాజిల్లుతుందని పండితులు చెబుతుంటారు. ప్రస్తుతం వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్న శుక్రుడు, తన నక్షత్రాన్ని మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

నేటి నుంచి ఈ రాశులకు ధన వర్షం.. శుక్రుడి కటాక్షంతో మీ ఇల్లు లక్ష్మీ నిలయమే!
నేటి నుంచి ఈ రాశులకు ధన వర్షం.. శుక్రుడి కటాక్షంతో మీ ఇల్లు లక్ష్మీ నిలయమే!

హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు అనగా మే 8, 2026 శుక్రవారం రాత్రి 09:51 గంటలకు శుక్రుడు రోహిణి నక్షత్రం నుంచి నిష్క్రమించి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (మంగళుడు). శుక్రుడు మే 19 వరకు కుజుడి నక్షత్రంలోనే సంచరిస్తాడు. కుజుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక కాగా, శుక్రుడు సౌందర్యానికి, సంపదకు కారకుడు. ఈ రెండు గ్రహాల ప్రభావం కలవడం వల్ల కొన్ని రాశుల వారి జాతకాల్లో 'ధన యోగం' పట్టబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఈ 5 రాశుల వారికి నేటి నుంచి గోల్డెన్ పీరియడ్

కుజుడి నక్షత్రంలో శుక్రుడి సంచారం ప్రధానంగా ఈ రాశుల వారి తలరాతను మార్చబోతోంది:

1.మేష రాశి: పెరగనున్న ఆత్మవిశ్వాసం

మేష రాశికి అధిపతి కుజుడు కావడంతో, శుక్రుడి ఈ నక్షత్ర మార్పు మీకు ఎంతో మేలు చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, సమాజంలో ప్రత్యేక ఆకర్షణను పొందుతారు. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి. ఒంటరిగా ఉన్న వారికి నచ్చిన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది.

2.వృషభ రాశి: ఊహించని ధనలాభం

మీ రాశి అధిపతి శుక్రుడే కావడం వల్ల ఈ మార్పు మీకు వరంగా మారుతుంది. వ్యాపారస్తులకు రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది, ఇది భవిష్యత్తులో భారీ లాభాలకు దారితీస్తుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై ఖర్చు చేసినప్పటికీ, ఆదాయ మార్గాలు కూడా అదే స్థాయిలో మెరుగుపడతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారికి భారీ కాంట్రాక్టులు దక్కవచ్చు.

3.తులా రాశి: పెరగనున్న వాక్చాతుర్యం

తులా రాశి వారికి ఈ గోచార కాలం అకస్మాత్తుగా ధన లాభాన్ని చేకూరుస్తుంది. మీ మాట తీరులో స్పష్టత, ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.

4.వృశ్చిక రాశి: కెరీర్‌లో బ్రేక్ త్రూ

మీ రాశికి కూడా కుజుడే అధిపతి. వృత్తి జీవితంలో మీరు ఊహించని సానుకూల మార్పులు చూస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా ఉత్సాహంగా పని చేస్తారు, దీనివల్ల మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

5.కుంభ రాశి: సృజనాత్మక విజయం

మీకు ఇది కళాత్మక విజయాల కాలం. మీరు మీడియా, మార్కెటింగ్ లేదా ఏదైనా క్రియేటివ్ రంగంలో ఉంటే, ఈ సమయం మీకు 'గోల్డెన్ పీరియడ్' అని చెప్పవచ్చు. సామాజిక వర్గాల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీ ఎదుగుదలకు తోడ్పడతారు.

ఫలితాలు మరింత మెరుగుపడాలంటే ఇలా చేయండి

ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు లేదా కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే, ఈ క్రింది పరిహారాలు పాటించడం వల్ల శుభ ఫలితాల తీవ్రత పెరుగుతుంది:

శుక్రవారం దానాలు: తెలుపు రంగు వస్తువులైన పాలు, పెరుగు, పంచదార లేదా తెల్లటి వస్త్రాలను అవసరమున్న వారికి దానం చేయండి.

హనుమాన్ చాలీసా: కుజుడి నక్షత్ర ప్రభావం వల్ల వచ్చే ఉగ్రతను తగ్గించుకుని, శుక్రుడి సౌమ్యతను పొందడానికి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More