చాణక్య నీతి.. ఈ రెండు తప్పులు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయ్!
పిల్లలను కేవలం ప్రేమతోనే కాకుండా, సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన విద్య, క్రమశిక్షణ ఉన్న వాతావరణంలో పెంచాలి. అప్పుడే వారి భవిష్యత్ బాగుంటుంది. చాణక్య నీతి ప్రకారం రెండు తప్పులు చేయకూడదు.
తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా, విజయవంతమైన వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటారు. పిల్లల ప్రవర్తన, వ్యక్తిత్వం, విలువలు ఇంటి వాతావరణంలోనే పెరుగుతాయి. ఇందులో తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యం. ఈ విషయంలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తల్లిదండ్రులకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. తల్లిదండ్రులు చేసే రెండు తప్పులు వారి పిల్లల భవిష్యత్తును పూర్తిగా ఎలా నాశనం చేస్తాయో చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.

విద్య అందించకపోవడం
చాణక్యుని ప్రకారం, పిల్లలకు సరైన విద్యను అందించకపోవడమే తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు. చదువులేని పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని, అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు శత్రువుల వంటివారని చాణక్యుడు అన్నారు. నేటి పోటీ యుగంలో విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించే మార్గం మాత్రమే కాదు. అది పిల్లల ఆలోచనా శక్తిని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన ఆయుధం. విద్యావంతుల మధ్య చదువుకోని వ్యక్తి.. హంసల గుంపులో కొంగలా అవమానంతో బ్రతకాల్సి వస్తుంది. అలా పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అందువల్ల అక్షరాస్యత మాత్రమే కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, జీవిత నైపుణ్యాలను నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక కర్తవ్యం కావాలి.
మితిమీరిన గారాబం
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించడం సహజమే, కానీ ఆ ప్రేమ మితిమీరిన గారాబంగా మారకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లలు తప్పులు చేసినప్పుడు వారిని సరిదిద్దకుండా, గుడ్డి ప్రేమతో వారికి మద్దతు ఇవ్వడం వారి భవిష్యత్తుకు పెద్ద సమస్య అవుతుందని చాణక్యుడు హెచ్చరించాడు. పిల్లలు అడిగిన వెంటనే వారి ప్రతి కోరికను తీర్చడం, వారి తప్పులను పట్టించుకోకపోవడం వారిలో బాధ్యతారాహిత్యం, మొండితనం, క్రమశిక్షణారాహిత్యం వంటి లక్షణాలను పెంపొందిస్తుంది. ఇదే స్వభావంతో పిల్లలు సమాజంలో తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలు తప్పులు చేసినప్పుడు వారిని సరిదిద్దే బాధ్యత నుండి తల్లిదండ్రులు ఎన్నడూ తప్పించుకోకూడదు. ప్రేమతో పాటు మంచి చెడుల విచక్షణను వారిలో పెంపొందించడం అత్యవసరం.
పిల్లలలో నిజాయితీ, సత్యం, కరుణ, ఇతరుల పట్ల గౌరవం వంటి విలువలను పెంపొందించే బాధ్యత ఇంట్లోనే ప్రారంభం కావాలి. పిల్లలు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించి, దానిని సులభంగా అనుకరిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు ముందుగా తామే ఆదర్శంగా నిలవాలి, క్రమశిక్షణతో ఉండాలి. పిల్లలను కేవలం ప్రేమతోనే కాకుండా సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెంచినప్పుడు మాత్రమే వారు భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా ఎదగుతారని చాణక్య నీతి చెబుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


