హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈరోజే ఈ పవిత్ర వ్రతం ఆచరలించాలి. ఈ ఏకాదశితోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరాసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని, ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను భోజన ప్రియుడైన ఆ పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ పవిత్రమైన రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఆచరించి, శ్రీహరిని పూజిస్తారు. కేవలం పూజలు మాత్రమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుందని విశ్వాసం. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మి కటాక్షం కూడా సంపూర్ణంగా లభిస్తుంది.
దేవశయని/ తొలి ఏకాదశి తేదీ, ముహూర్తం
హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది జూలై 25, 2026 శనివారం నాడు దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. రేపు అంటే జూలై 26న ఉదయం నిర్ణీత సమయంలో ద్వాదశి పారణతో వ్రతాన్ని ముగిస్తారు. ఈ పర్వదినాన విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అర్చిస్తారు.
తొలి ఏకాదశి వ్రతంతో కలిగే ముఖ్య లాభాలు
పాపాల నుంచి విముక్తి: పురాణాల ప్రకారం, దేవశయని ఏకాదశి రోజున మనసారా ఉపవాసం ఉంటే, జీవితంలో తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి. భగవంతుని అనుగ్రహంతో కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి.
మోక్ష ప్రాప్తి: ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు లౌకిక సుఖాలను అనుభవించిన తర్వాత అంతిమంగా వైకుంఠ ప్రాప్తిని పొందుతారని నమ్ముతారు. శ్రీహరి, లక్ష్మీదేవి సంయుక్త పూజ జీవితంలో అపారమైన విజయాలను తెచ్చిపెడుతుంది.
అక్షయ పుణ్య ఫలం: పద్మ పురాణం ప్రకారం, దేవశయని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఏకంగా 88 వేల యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ రోజు దానధర్మాలు చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.
{{/usCountry}}అక్షయ పుణ్య ఫలం: పద్మ పురాణం ప్రకారం, దేవశయని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఏకంగా 88 వేల యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ రోజు దానధర్మాలు చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.
{{/usCountry}}ఇంటా బయటా ప్రశాంతత: ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మనిషిలో సానుకూల ఆలోచనలు పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఇంద్రియ నిగ్రహం: ఏకాదశి వ్రతం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక నిగ్రహాన్ని ఇస్తుంది. ఈ రోజు భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది.
ఈ ఏకాదశి రోజు ఈ నియమాలు పాటించాలి
ఏకాదశి పర్వదినాన కొన్ని ప్రత్యేక నియమాలను విధిగా పాటించాలి.
ముఖ్యంగా ఈ రోజు తులసి చెట్లను తాకకూడదని పెద్దలు చెబుతుంటారు.
హిందూ ధర్మంలో తులసిని సాక్షాత్తూ లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఆ తల్లి కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తుందని, ఈ రోజు తులసిని తాకడం వల్ల ఆ వ్రత భంగం కలుగుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు.