...
...
Next Story

Tirumala Donor Benefits: లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విరాళం ఇచ్చే దాతలకు.. దర్శనంతో పాటు కలిగే ఇతర సౌకర్యాలు ఇవే!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివిధ ట్రస్టులకు విరాళాలు అందించే భక్తుల కోసం ప్రత్యేక దర్శన, వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విరాళం ఇచ్చే దాతలకు లభించే ప్రివిలేజెస్ పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Published on: Apr 20, 2026 04:00 PM IST
Advertisement

కలియుగంలో ప్రజలను రక్షించడానికి విష్ణు స్వయంగా వెంకటేశ్వర స్వామి అవతారాన్ని ఎత్తాడు. భక్తులు “గోవిందా గోవిందా” అని జపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని బలంగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలసినారు. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే ఆలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి.

Tirumala Donor Benefits: లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విరాళం ఇచ్చే దాతలకు.. దర్శనంతో పాటు కలిగే ఇతర సౌకర్యాలు (pinterest)
Tirumala Donor Benefits: లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విరాళం ఇచ్చే దాతలకు.. దర్శనంతో పాటు కలిగే ఇతర సౌకర్యాలు (pinterest)

ఇక్కడ తలనీలాలు సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథోత్సవం వంటివి జరుపుతారు. వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం

చాలా మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో విరాళాలు ఇస్తే భక్తులు కొన్ని అవకాశాలను పొందుతారు. దర్శనం, ప్రసాదం ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. మరి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చే విరాళాల వలన భక్తులు కలిగే అవకాశాల గురించి తెలుసుకుందాం.

ఇక్కడ భక్తులు రూపాయి నుంచి కోటి ఆపై ఎంతైనా కూడా ఇవ్వచ్చు. ఒక రోజు అన్నదానం చేయాలంటే 44 లక్షల రూపాయలు ఇవ్వాలి. అల్పాహారానికి 10 లక్షలు, మధ్యాహ్నం భోజనానికి 17 లక్షలు, రాత్రి 17 లక్షలు ఇవ్వాలి.

శ్రీవారి సేవలో తరిస్తూ.. విశేష దర్శన భాగ్యం!

ఎవరైనా భక్తులు ఒక లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు విరాళం ఇస్తే, వారికి ఐదుగురితో కలిసి సుపథం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు రూ. 100 విలువైన గదిలో వసతి, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా మరియు జాకెట్ ముక్కను అందజేస్తారు.

5 లక్షల నుంచి 10 లక్షలు

ఇక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు విరాళం ఇస్తే, ఆ సదుపాయాలు మరింత పెరుగుతాయి. ఏడాదిలో మూడు రోజుల పాటు ఐదుగురికి సుపథం ద్వారా దర్శన భాగ్యం. వీరికి 10 చిన్న లడ్డూలు, ఐదు మహాప్రసాదాలతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.

10 నుంచి 25 లక్షలు:

ఐదుగురికి మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనం లభిస్తుంది. రూ. 1000 విలువైన గదిలో వసతితో పాటు 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు ఇస్తారు. అదనంగా 50 గ్రాముల వెండి నాణెం ఇస్తారు.

25 నుంచి 50 లక్షలు:

వీరికి మూడు రోజుల బ్రేక్ దర్శనంతో పాటు, ఒక రోజు సుపథం దర్శనం అదనంగా లభిస్తుంది. వీరికి రూ. 1500 విలువైన వసతి గదిని కేటాయిస్తారు. ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం కానుకగా అందుతాయి.

50 నుంచి 75 లక్షలు:

ఒక రోజు సుప్రభాత సేవ (ఐదుగురికి), మూడు రోజుల బ్రేక్ దర్శనం, రెండు రోజుల సుపథం దర్శనం లభిస్తాయి. రూ. 2000 విలువైన గది, బంగారు డాలర్, వెండి కాయిన్ ఇస్తారు.

75 లక్షల నుంచి కోటి:

వీరికి రెండు రోజుల సుప్రభాత సేవ, నాలుగు రోజుల సుపథం, మూడు రోజుల బ్రేక్ దర్శనం లభిస్తాయి. వీరికి ఒక రోజు వేద ఆశీర్వచనం కూడా ఉంటుంది.

కోటి రూపాయలకు పైగా:

కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు మూడు రోజుల సుప్రభాత సేవ, మూడు రోజుల బ్రేక్ దర్శనం, నాలుగు రోజుల సుపథం దర్శన భాగ్యం కల్పిస్తారు. పది చిన్న లడ్డూలు, 20 పెద్ద లడ్డూలు, పది మహాప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం, 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం అందిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe