జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మూడు ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసానికి (పురుషోత్తమ మాసం) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని 'కమలా ఏకాదశి' లేదా 'పద్మిని ఏకాదశి' అని పిలుస్తారు. దీని విశిష్టత గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన కథ భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. సకల పాపాలను హరించి, కోరిన కోర్కెలు తీర్చే ఈ వ్రత విధానం, దాని వెనుక ఉన్న పురాణ గాథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జయశర్మ కథ.. పాపభీతి నుండి పరివర్తన వరకు

పూర్వం అవంతీపురంలో శివశర్మ అనే వేద పండితుడు ఉండేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు. వారిలో చిన్నవాడైన జయశర్మ దుష్ట సావాసాల వల్ల తప్పుడు మార్గంలో నడిచేవాడు. కొడుకు ప్రవర్తన నచ్చక తండ్రి, బంధువులు అతడిని వెలివేశారు. తన తప్పు తెలుసుకోకుండా అడవుల పాలైన జయశర్మ, ఆకలి దప్పులతో అలమటిస్తూ దైవయోగం వల్ల ప్రయాగ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత, ఆకలి తీర్చుకోవడానికి హరిమిత్ర ముని ఆశ్రమానికి వెళ్లాడు.
ఆ సమయంలో ఆశ్రమంలో భక్తులంతా పురుషోత్తమ మాస విశిష్టత గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే దారిద్య్రం తొలగిపోయి, మోక్షం లభిస్తుందని మునులు చెప్పడం జయశర్మ విన్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్న జయశర్మ, ముని ఆశ్రమంలోనే భక్తితో ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.
లక్ష్మీదేవి ప్రత్యక్షం.. అఖండ ఐశ్వర్యం
జయశర్మ నిష్ఠగా వ్రతం చేస్తుండగా, అర్థరాత్రి సమయంలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. "నీ భక్తికి, ఈ వ్రత ప్రభావానికి నేను ప్రసన్నురాలినయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో," అని అమ్మవారు పలికారు. దానికి జయశర్మ వినయంగా.. "అమ్మా, నా పాపాలు తొలగిపోయి, నీ కటాక్షం మా కుటుంబంపై ఉండాలి," అని వేడుకున్నాడు.
లక్ష్మీదేవి ఈ ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ.. "ఎవరైతే ఈ రోజున విష్ణు నామస్మరణ చేస్తారో, వారికి అంతా మంచి జరుగుతుంది. కేవలం ఒక్క శ్లోకం లేదా సగం శ్లోకం చదివినా కోటి పాపాలు నశిస్తాయి. పక్షుల్లో గరుడుడు, నదుల్లో గంగ ఎంత శ్రేష్ఠమో.. తిథుల్లో ఏకాదశి అంత గొప్పది," అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత జయశర్మ అపారమైన ధనవంతుడిగా మారి, తన తండ్రి వద్దకు చేరుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు.
పుణ్య ఫలితాలు.. పూజా విధానం
{{/usCountry}}లక్ష్మీదేవి ఈ ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ.. "ఎవరైతే ఈ రోజున విష్ణు నామస్మరణ చేస్తారో, వారికి అంతా మంచి జరుగుతుంది. కేవలం ఒక్క శ్లోకం లేదా సగం శ్లోకం చదివినా కోటి పాపాలు నశిస్తాయి. పక్షుల్లో గరుడుడు, నదుల్లో గంగ ఎంత శ్రేష్ఠమో.. తిథుల్లో ఏకాదశి అంత గొప్పది," అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత జయశర్మ అపారమైన ధనవంతుడిగా మారి, తన తండ్రి వద్దకు చేరుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు.
పుణ్య ఫలితాలు.. పూజా విధానం
{{/usCountry}}ఈ వ్రతాన్ని ఆచరించే వారు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది.
స్నాన విధి: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
ఇంట్లో జపం చేస్తే ఒక వంతు పుణ్యం వస్తే, నదీ తీరంలో రెట్టింపు, గోశాలలో వేయి రెట్లు, విష్ణు లేదా శివ క్షేత్రాల్లో అనంతమైన పుణ్యం లభిస్తుంది.
ఉపవాసం - జాగరణ:
ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి, రాత్రి సమయంలో విష్ణు లీలలు, పురాణ పఠనం, భజనలతో జాగరణ చేయాలి. "ఈ వ్రతం చేసే వారి ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది," అని పురాణాలు చెబుతున్నాయి.
ద్వాదశి పారణ:
మరుసటి రోజు (ద్వాదశి) భక్తితో విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి నాడు పంచామృతాలతో, ద్వాదశి నాడు కేవలం పాలతో స్వామికి అభిషేకం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు సమర్పించిన తర్వాత కుటుంబంతో కలిసి భోజనం చేయాలి.
ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని శుద్ధ భావంతో ఆచరించే వారు పునర్జన్మ లేని వైకుంఠ ధామాన్ని పొందుతారని సాక్షాత్తు శ్రీకృష్ణుడు వివరించారు. ఎవరైతే ఈ కథను వింటారో లేదా చదువుతారో వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.