...
...
Next Story

నేడే మూడేళ్లకు వచ్చే పద్మిని ఏకాదశి.. దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఈ వ్రత కథ వినాల్సిందే!

అధిక మాసంలో వచ్చే పద్మిని లేదా కమలా ఏకాదశి వ్రత మహత్యాన్ని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించారు. ఈ వ్రతం ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం లభించడమే కాక, సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఈ కథ వినాల్సిందే.

Published on: May 27, 2026, 08:00:22 IST
Advertisement

జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం మూడు ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసానికి (పురుషోత్తమ మాసం) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని 'కమలా ఏకాదశి' లేదా 'పద్మిని ఏకాదశి' అని పిలుస్తారు. దీని విశిష్టత గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన కథ భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. సకల పాపాలను హరించి, కోరిన కోర్కెలు తీర్చే ఈ వ్రత విధానం, దాని వెనుక ఉన్న పురాణ గాథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జయశర్మ కథ.. పాపభీతి నుండి పరివర్తన వరకు

నేడే మూడేళ్లకు వచ్చే పద్మిని ఏకాదశి.. దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఈ కథ వినాల్సిందే! (pinterest)
నేడే మూడేళ్లకు వచ్చే పద్మిని ఏకాదశి.. దరిద్రం పోయి ఐశ్వర్యం సిద్ధించాలంటే ఈ కథ వినాల్సిందే! (pinterest)

పూర్వం అవంతీపురంలో శివశర్మ అనే వేద పండితుడు ఉండేవారు. ఆయనకు ఐదుగురు కుమారులు. వారిలో చిన్నవాడైన జయశర్మ దుష్ట సావాసాల వల్ల తప్పుడు మార్గంలో నడిచేవాడు. కొడుకు ప్రవర్తన నచ్చక తండ్రి, బంధువులు అతడిని వెలివేశారు. తన తప్పు తెలుసుకోకుండా అడవుల పాలైన జయశర్మ, ఆకలి దప్పులతో అలమటిస్తూ దైవయోగం వల్ల ప్రయాగ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత, ఆకలి తీర్చుకోవడానికి హరిమిత్ర ముని ఆశ్రమానికి వెళ్లాడు.

సమయంలో ఆశ్రమంలో భక్తులంతా పురుషోత్తమ మాస విశిష్టత గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే దారిద్య్రం తొలగిపోయి, మోక్షం లభిస్తుందని మునులు చెప్పడం జయశర్మ విన్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్న జయశర్మ, ముని ఆశ్రమంలోనే భక్తితో ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.

లక్ష్మీదేవి ప్రత్యక్షం.. అఖండ ఐశ్వర్యం

జయశర్మ నిష్ఠగా వ్రతం చేస్తుండగా, అర్థరాత్రి సమయంలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. "నీ భక్తికి, ఈ వ్రత ప్రభావానికి నేను ప్రసన్నురాలినయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో," అని అమ్మవారు పలికారు. దానికి జయశర్మ వినయంగా.. "అమ్మా, నా పాపాలు తొలగిపోయి, నీ కటాక్షం మా కుటుంబంపై ఉండాలి," అని వేడుకున్నాడు.

ఈ వ్రతాన్ని ఆచరించే వారు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది.

స్నాన విధి: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.

ఇంట్లో జపం చేస్తే ఒక వంతు పుణ్యం వస్తే, నదీ తీరంలో రెట్టింపు, గోశాలలో వేయి రెట్లు, విష్ణు లేదా శివ క్షేత్రాల్లో అనంతమైన పుణ్యం లభిస్తుంది.

ఉపవాసం - జాగరణ:

ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి, రాత్రి సమయంలో విష్ణు లీలలు, పురాణ పఠనం, భజనలతో జాగరణ చేయాలి. "ఈ వ్రతం చేసే వారి ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది," అని పురాణాలు చెబుతున్నాయి.

ద్వాదశి పారణ:

మరుసటి రోజు (ద్వాదశి) భక్తితో విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి నాడు పంచామృతాలతో, ద్వాదశి నాడు కేవలం పాలతో స్వామికి అభిషేకం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు సమర్పించిన తర్వాత కుటుంబంతో కలిసి భోజనం చేయాలి.

ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని శుద్ధ భావంతో ఆచరించే వారు పునర్జన్మ లేని వైకుంఠ ధామాన్ని పొందుతారని సాక్షాత్తు శ్రీకృష్ణుడు వివరించారు. ఎవరైతే ఈ కథను వింటారో లేదా చదువుతారో వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks