ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ 14న, 15న? తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి!

 పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో మొత్తం 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి?

Published on: Nov 13, 2025 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి సంవత్సరం నెలకు రెండు ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో మొత్తం 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్పన్న ఏకాదశి 2025 (Pixabay)
ఉత్పన్న ఏకాదశి 2025 (Pixabay)

ఉత్పన్న ఏకాదశి 2025

ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న వచ్చింది. ఏకాదశి తిథి నవంబర్ 14 రాత్రి 12:49కి ప్రారంభమై, నవంబర్ 15 తెల్లవారుజామున 2:37కి ముగుస్తుంది.ఈ లెక్కన నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అయితే, ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది.

ఈ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం, విష్కంభ యోగం, అభిజిత్ ముహూర్తం కలయిక ఉండడం, పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం. శనివారం నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి, తులసి దళాలు, తీయటి ఆహార పదార్థాలు సమర్పిస్తే మంచిది.

నువ్వుల నూనెతో దీపారాధన

శనివారం రావడం వలన శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి.

ఉత్పన్న ఏకాదశి పూజా విధానం

  1. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం గురించి చూస్తే.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోని పెట్టి దీపారాధన చేయండి.
  2. ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి, ఐదు రకాల పండ్లు నైవేద్యంగా పెట్టండి.
  3. దీంతో పాటుగా తులసి మొక్క ముందు దీపారాధన చేయండి.
  4. ఉపవాసం ఉండడం వలన సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. లక్ష్మీదేవి, విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు.
  5. ఈ ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది. జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.
News/Rasi Phalalu/ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ 14న, 15న? తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి!
News/Rasi Phalalu/ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ 14న, 15న? తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి!