Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిది?
వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చని విశ్వాసం. అలాగే దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, అదృష్టం వస్తుంది. మీ రాశి ప్రకారం ఏవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకోండి.
వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) హిందువులకు ముఖ్యమైన పర్వదినం. దీనిని ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) అని కూడా అంటారు. ఈ పర్వదినాన విష్ణువుని ఆరాధించి ఉపవాస దీక్షను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చని విశ్వాసం. అలాగే దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, అదృష్టం వస్తుంది.

ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందడానికి కూడా వీలవుతుంది. మరి వైకుంఠ ఏకాదశి నాడు ఏ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి ప్రకారం ఏవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకోండి.
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని దానం చేస్తే మంచిది?
ఈరోజు చాలా పవిత్రమైన రోజు. చాలామంది ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా చేసుకుంటారు. అలాగే దానాలు చేయడం వలన మంచి జరుగుతుంది. ఇలా భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
మేష రాశి
మేష రాశి వారు ఈ పరమ పవిత్రమైన రోజున ఎర్రటి వస్త్రాలు, కుంకుమ, బెల్లం దానం చేయడం వలన మంచి జరుగుతుంది. చక్కటి ఫలితాన్ని చూస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజున తెల్ల బట్టలు, పప్పు దానం చేస్తే మంచిది. అలాగే మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి వెండి వస్తువులను దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారు శంఖాలు, నాణేలను దానం చేయడం మంచిది. అలాగే పాత్రలు, వస్త్రాలు, ఆకుపచ్చని పండ్లు దానం చేస్తే కూడా ఎంతో మంచి కలుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు బియ్యం, తెల్లని వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు, పప్పులు దానం చేయడం వలన చక్కటి ఫలితాన్ని చూస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారు లక్ష్మీనారాయణ ఆలయంలో పూజలు చేసి, అక్కడకు వెళ్లినప్పుడు ఉపయోగపడే వస్తువులను దానం చేయడం మంచిది. అలాగే వెండి దానం చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని చూస్తారు.
కన్యా రాశి
కన్యా రాశి వారు వస్త్రాలు, బియ్యం, మినుములు, ఆకుపచ్చని పండ్లను దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.
తులా రాశి
తులా రాశి వారు శివాలయంలో తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయడం మంచిది. అలాగే పువ్వులు, స్వీట్లు, సుగంధ ద్రవ్యాలను దానం చేస్తే చక్కటి ఫలితాన్ని చూస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు బెల్లం, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పూలు వంటి వాటిని దానం చేయడం వలన మంచి ఫలితం కనబడుతుంది. ఆనందంగా ఉండొచ్చు. విష్ణువు అనుగ్రహంతో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు బ్రాహ్మణులకు స్వయంపాకం ఇస్తే మంచిది. అలాగే పసుపు వస్త్రాలు, పండ్లు దానం చేస్తే కూడా చక్కటి ఫలితం చూస్తారు.
మకర రాశి
మకర రాశి వారు నీలి రంగు వస్త్రాలు, లడ్డూలు, పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి వాటిని దానం చేస్తే మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు నల్లని వస్త్రాలు, నువ్వులు, బెల్లం, బియ్యం, బార్లీ వంటి వాటిని దానం చేస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. ఆనందంగా ఉండొచ్చు.
మీన రాశి
మీన రాశి వారు పసుపు రంగు స్వీట్లు, పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు వంటి వాటిని దానం చేస్తే మంచిది. చక్కటి ఫలితం కనబడుతుంది. ఆనందంగా ఉండొచ్చు.

E-Paper












