వరలక్ష్మీ వ్రతం 2026: పూజకు కావాల్సిన సామాగ్రి, తోరం కట్టుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం!
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. పసుపు, కుంకుమ, నైవేద్య సామాగ్రితో పాటు దీపారాధనకు కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. అయితే వరలక్ష్మీ వ్రతం చేసేవారు కచ్చితంగా కొన్ని వస్తువులను ముందే సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి పూజా సామాగ్రి లిస్ట్ చూసేసి ఇప్పుడే రెడీ పెట్టేసుకోండి.

వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి:
వరలక్ష్మీ వ్రతాన్ని నియమనిష్టలతో జరుపుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ వరలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వాళ్లు కచ్చితంగా విధానాన్ని తెలుసుకుని పాటించాలని, అలాగే వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.
వరలక్ష్మీ వ్రతానికి పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, అగరబత్తులు, వక్కలు, తమలపాకులు, బియ్యం, బెల్లం, డబ్బా, అరటి పండ్లు కావాలి. అలాగే నైవేద్యానికి మిశ్రమ ఫలాలు తీసుకోండి. మూడు రకాల పండ్లు ఉండేటట్టు చూసుకోండి. పూలమాలలు, విడి పువ్వులు, కొబ్బరికాయలు, చిల్లర పైసలు, కలశం కోసం చెంబు, పంచామృతాలు, తోరాలు, మామిడి కొమ్మలు, జాకెట్ ముక్కలు, ఆభరణ ద్రవ్యాలు, ఆచమన పాత్ర, అక్షంతలు, వరిపిండి, అమ్మవారికి పేట, హారతి పళ్లెం, గంట, వాయినాలు, నైవేద్యం, అమ్మవారి ప్రతిమ.
దీపారాధనకి కావలసిన సామాగ్రి: ఆవు నెయ్యి, అగ్గిపెట్టె, ఒత్తులు, చేతులు తుడుచుకోవడానికి వస్త్రం.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, పూజా మందిరాన్నీ కూడా శుభ్రం చేసుకుని మండపాన్ని ఏర్పాటు చేయాలి.
మండపం పైన బియ్యపు పిండితో ముగ్గులు వేసి, కలశం పెట్టుకోవాలి.
ఆ తర్వాత అమ్మవారి ఫోటో లేదా రూపును పెట్టుకుని పూజ చేయాలి.
తోరాలు, అక్షింతలు, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.
గణపతి పూజ చేసి, ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవాలి.
చివరిగా వ్రతకథ చదువుకోవాలి. అమ్మవారికి చేసిన నైవేద్యాలను సమర్పించాలి.
ఇలా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సకల సౌభాగ్యాలు అందుతాయి. లక్ష్మీదేవి కృపతో ఐశ్వర్యం లభిస్తుంది. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండడానికి వ్రతాన్ని తప్పక ఆచరించడం మంచిది.
తోరం కట్టుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం
బధ్నామి దక్షిణే హస్తే
నవసూత్రం శుభప్రదమ్
పుత్రపౌత్రాభివృద్ధిం చ
దీర్ఘాయుష్యమవాప్నుయాత్..
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


