జ్యోతిష్య శాస్త్రంలో 'శని' పేరు వింటేనే సామాన్యుల్లో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ముఖ్యంగా ఏల్నాటి శని కాలం సుమారు ఏడున్నర ఏళ్లు ఉండటంతో, అంత కాలం కష్టాలు తప్పవేమోనని భయపడతారు. అయితే, శని దేవుడు ఎప్పుడూ కీడు మాత్రమే చేయడు. ఆయన 'కర్మ ఫల ప్రదాత'. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే క్రమంలో మనిషిని రాటుదేల్చుతాడు. ఓర్పు, క్రమశిక్షణ ఉన్నవారికి ఈ కాలంలోనే అద్భుతమైన విజయాలు లభిస్తాయి. ప్రస్తుతం మేషం, కుంభం, మీన రాశి వారు శని ప్రభావంలో ఉన్నారు. వీరికి ఈ గడ్డు కాలం నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి: మార్పులకు సిద్ధంగా ఉండండి

మేష రాశి వారికి 2025 మార్చి 29 నుంచి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమైంది. తొలి దశలో సాధారణంగా మానసిక ఆందోళన, పని ఒత్తిడి, బాధ్యతలు అకస్మాత్తుగా పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో తెలియని అస్థిరత మిమ్మల్ని వేధిస్తుండవచ్చు. జ్యోతిష్య లెక్కల ప్రకారం, ఈ రాశి వారికి 2032 మే 31 వరకు శని ప్రభావం ఉంటుంది. శని మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాతే మేష రాశి వారికి పూర్తి విముక్తి లభిస్తుంది. అప్పటి వరకు మీ నిర్ణయాల్లో ఆవేశం తగ్గించి, విజ్ఞతతో వ్యవహరించడం శ్రేయస్కరం.
కుంభ రాశి: ఊపిరి పీల్చుకునే సమయం ఆసన్నమైంది
గడిచిన కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కుంభ రాశి వారికి ఒక తీపి కబురు. మీరు ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. సాధారణంగా ఏడున్నర ఏళ్ల కాలంలో చివరి దశ కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. 2027 జూన్ 3వ తేదీన శని రాశి పరివర్తనం చెందిన వెంటనే కుంభ రాశి వారికి శని పీడ నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది. అంటే, ఇక మీరు ఎదురుచూడాల్సిన కాలం చాలా తక్కువగా ఉంది. అప్పటి వరకు మొండితనం వీడి, పట్టుదలతో పని పూర్తి చేస్తే సత్ఫలితాలు అందుతాయి.
మీన రాశి: మధ్య దశతో జాగ్రత్త
మీన రాశి వారికి అసలైన పరీక్ష ఇకపైనే మొదలు కానుంది. 2027 జూన్ 3 నుంచి వీరికి శని రెండో దశ ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో రెండో దశను అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఈ కాలంలో ఆర్థిక లావాదేవీలు, కెరీర్, మానసిక సమతుల్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వీరికి 2029 ఆగస్టు 8న శని తన గమనాన్ని మార్చుకోవడంతో ఏల్నాటి శని నుంచి విముక్తి కలుగుతుంది.
శని ప్రభావాన్ని తగ్గించుకునే మార్గాలివే
{{/usCountry}}మీన రాశి వారికి అసలైన పరీక్ష ఇకపైనే మొదలు కానుంది. 2027 జూన్ 3 నుంచి వీరికి శని రెండో దశ ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో రెండో దశను అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఈ కాలంలో ఆర్థిక లావాదేవీలు, కెరీర్, మానసిక సమతుల్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వీరికి 2029 ఆగస్టు 8న శని తన గమనాన్ని మార్చుకోవడంతో ఏల్నాటి శని నుంచి విముక్తి కలుగుతుంది.
శని ప్రభావాన్ని తగ్గించుకునే మార్గాలివే
{{/usCountry}}శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం భయపడితే సరిపోదు, పరిహార మార్గాలను పాటించాలి.
- ప్రతి శనివారం 'హనుమాన్ చాలీసా' పఠించడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది.
- రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం.
- నిస్సహాయులకు, పేదలకు నల్ల నువ్వులు లేదా వస్త్రాలను దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
- శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- ముఖ్యంగా "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి.
ఛాయాదానం అంటే ఏమిటి?
శని ప్రభావం తగ్గించుకోవడానికి ఉన్న సులభమైన, శక్తివంతమైన మార్గం 'ఛాయాదానం'. ఒక గిన్నెలో నువ్వుల నూనె తీసుకుని, అందులో మీ ముఖం కనిపించేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనెను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.