పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ భూమి నుంచి వెళ్లిపోక తప్పదు. మన హిందూ ధర్మంలో పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి దశకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. గరుడ పురాణం ప్రకారం మనిషి అంత్యక్రియలకు సంబంధించి అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. ఎప్పుడైనా సరే శాస్త్రోత్తంగా కార్యక్రమాలు చేస్తేనే ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది. అందుకే ఒక మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలను ఎంతో నిష్టతో, నియమాలతో జరుపుతారు.
అంతిమ సంస్కారాల వెనుక పరమార్థం ఏంటి?

మరణం అనేది శరీరానికి మాత్రమే ఏర్పడుతుందని హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైనది, అమరమైనది. దహన సంస్కారాలే మనిషి పంచభూతాల్లో కలిసిపోవడానికి సరైన మార్గం. ఒకవేళ ఎవరైనా అంత్యక్రియలను విధివిధానాల ప్రకారం నిర్వహించకపోయినట్లయితే ఆ ఆత్మకు మోక్షం కలగదని, భూలోకంలోనే ఆ ఆత్మ సంచరిస్తుందని పండితులు చెబుతున్నారు.
సూర్యాస్తమయం అయిన తర్వాత దహన సంస్కారాలు ఎందుకు చేయకూడదు?
సూర్యాస్తమయం అయిన తర్వాత దహన సంస్కారాలు చేయకూడదని అశుభంగా భావిస్తారు. సూర్యుడు వెలుగు, శక్తి, సానుకూలతకు నిదర్శనం. పగలవేళ సూర్యుడు సమక్షంలో అంత్యక్రియలు జరిపితే ఆత్మకు దేవతల ఆశీస్సులు కలుగుతాయని, ఆ వ్యక్తి స్వర్గలోక ప్రాప్తిని పొందుతారని నమ్మకం. అదే ఒకవేళ రాత్రి నిర్వహించినట్లయితే ప్రతికూల శక్తులు, అసుర శక్తుల ప్రభావం ఉంటుందని చెబుతారు. చీకటి పడ్డాక ఆత్మకు సద్గతి లభించడం కష్టమని, ఆత్మ పిశాచ రూపం ఎత్తవచ్చని పురాణాలు హెచ్చరిస్తున్నాయి.
ఎవరైనా రాత్రి చనిపోతే తర్వాత రోజు సూర్యోదయం దాకా వేచి ఉండి, అప్పుడే దహన సంస్కారాలు చేయాలని చెబుతారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో రాత్రి దహన సంస్కారం చేయాల్సి వస్తే వివిధ రకాల పరిహారాలను పాటించాల్సి ఉంటుంది.
శాస్త్రీయ, సామాజిక కారణాలు
దీని వెనుక శాస్త్రీయ, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో రాత్రివేళ వెలుతురు సౌకర్యం ఉండేది కాదు. అడవుల్లో జంతువుల భయం కూడా ఉండేది. అలాగే స్మశాన వాటికలు ఊరికి చాలా దూరంగా ఉండేవి. చీకట్లో అంత్యక్రియలు నిర్వహించడం చాలా ప్రమాదకరం. పైగా వెలుతురు లేని చోట చితిని సరైన పద్ధతిలో పెట్టడానికి లేదా మంత్రోచ్చారణలకు బాగా కష్టమే. భద్రతా కారణాల దృష్ట్యా కూడా పగలు నిర్వహించడమే సరైన పద్దతి.
{{/usCountry}}దీని వెనుక శాస్త్రీయ, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో రాత్రివేళ వెలుతురు సౌకర్యం ఉండేది కాదు. అడవుల్లో జంతువుల భయం కూడా ఉండేది. అలాగే స్మశాన వాటికలు ఊరికి చాలా దూరంగా ఉండేవి. చీకట్లో అంత్యక్రియలు నిర్వహించడం చాలా ప్రమాదకరం. పైగా వెలుతురు లేని చోట చితిని సరైన పద్ధతిలో పెట్టడానికి లేదా మంత్రోచ్చారణలకు బాగా కష్టమే. భద్రతా కారణాల దృష్ట్యా కూడా పగలు నిర్వహించడమే సరైన పద్దతి.
{{/usCountry}}అందుకే ఒక విధంగా రాత్రిపూట అంత్యక్రియలు జరిపేవారు కాదు. భద్రతా కారణాల వల్ల కూడా పూర్వీకులు ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చి ఉండచ్చు. శాస్త్రాలను గౌరవిస్తూ, సాంప్రదాయాలను పాటిస్తూ చనిపోయిన వారిని పంపిస్తే పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయి.