కత్తి/కత్తెర నేరుగా వేరేవారి చేతికి ఇవ్వొద్దని ఎందుకు అంటారు? మీరు ఈ పొరపాటు చేస్తున్నారా?

కొన్ని నమ్మకాల ప్రకారం కత్తెరలు లేదా కత్తులను చేతిలో పెట్టుకుని వేరవారికి ఇవ్వడం నిషిద్ధం. అలా చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు.

Published on: May 18, 2026, 20:23:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ మతంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక నియమాలు, నమ్మకాలు ఉన్నాయి. అవి చాలా కాలంగా మన ఇళ్లలో వాడుకలో ఉన్నాయి. వాటి వెనక సైన్స్ కూడా ఉంది. కత్తెర లేదా కత్తిని ఎవరికీ నేరుగా చేతికి అందించే తప్పు ఎప్పుడూ చేయకూడదని పెద్దలు చెప్పడం మీరు ఎల్లప్పుడూ వినే ఉంటారు. అలా చేయడం సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా.. ప్రమాదాలు కలిగించే అనేక సమస్యలకు దారితీస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కత్తెర లేదా కత్తిని బల్ల మీద లేదా నేల మీద పెట్టి.. ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని తీసుకో అని చెప్పాలని పెద్దలు అంటుంటారు. కానీ కత్తెర లేదా కత్తిని నేరుగా ఎవరికైనా ఇవ్వడం ఎందుకు నిషిద్ధమో తెలుసా?

కత్తెరలు లేదా కత్తులను నేరుగా ఒకరి చేతికి ఇవ్వకపోవడానికి మతపరమైన, భద్రతాపరమైన కారణాలు రెండూ ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం.. పదునైన వస్తువును నేరుగా చేతికి ఇవ్వడం వల్ల సంబంధాలు చెడిపోయి, మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఇది పరస్పర ప్రేమ, సామరస్యానికి అశుభంగా పరిగణిస్తారు.

భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఈ నియమం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అనుకోని గాయాలను నివారించడానికి ఈ జాగ్రత్త తీసుకుంటారు. అంతేకాకుండా.. మానవ స్వభావం, పరిస్థితులను బట్టి చూస్తే, ఈ పద్ధతి భద్రతకు సరైనదిగా పరిగణించరు. అందుకే మర్యాద, భద్రత రెండింటినీ పాటించడానికి పదునైన వస్తువులను ఎల్లప్పుడూ కింద పెట్టడం ద్వారా లేదా ఇతర పద్ధతులను ఉపయోగించడం ద్వారా వేరేవారికి అందేలా చేయాలి.

కత్తెర లేదా కత్తిని నేరుగా ఎవరి చేతిలోనైనా పెట్టడం వలన కలహాలు, అపార్థాలు ఏర్పడతాయని, అలాగే సంబంధాలలో దూరం పెరుగుతుందని నమ్ముతారు. అందువల్ల కత్తెర లేదా కత్తిని నేరుగా ఎవరి చేతిలోనైనా పెట్టడాన్ని పెద్దలు ఆపుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మేకులు, పదునైన వస్తువులు ప్రతికూల శక్తిని వెలువరిస్తాయి. అందువల్ల కత్తెర లేదా కత్తిని నేరుగా ఇతరుల చేతిలో పెట్టకుండా ఉండాలి.

గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారం ఆర్టికల్ ఇచ్చాం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More