...
...
Next Story

సూర్య గ్రహణం ముగిశాక స్నానం ఎందుకు చేయాలి..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?

ఇవాళ(ఆగస్ట్ 12) ఏర్పడుతున్న సూర్యగ్రహణం ముగిసిన తర్వాత స్నానం, దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గ్రహణం వీడిన వెంటనే స్నానం ఎందుకు చేయాలో, ఆధ్యాత్మిక కారణాలెంటో ఇక్కడ తెలుసుకోండి…

Published on: Aug 12, 2026, 08:01:09 IST
Advertisement

నేడు, ఆగస్టు 12, 2026న ఈ సంవత్సరంలోనే రెండవ, చివరి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఖగోళ శాస్త్రవేత్తలకే కాకుండా ఆధ్యాత్మికంగా, మతపరంగానూ సూర్యగ్రహణానికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్న సంగతి తెలిసిందే. హిందూ సనాతన సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయానికి, అలాగే గ్రహణం ముగిసిన తర్వాత పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలను శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశించాయి.

సూర్యగ్రహణం ముగిసాక స్నానం ఎందుకు చేయాలి
సూర్యగ్రహణం ముగిసాక స్నానం ఎందుకు చేయాలి

ముఖ్యంగా గ్రహణ మొక్ష కాలం పూర్తయిన వెంటనే స్నానం చేయడం, దేవతా పూజలు నిర్వహించడం, శక్తిమేర దానధర్మాలు చేయడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే గ్రహణం ముగియగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానం ఎందుకు చేయాలి? దీని వెనుక ఉన్న విశ్వాసాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి…

జ్యోతిష్యశాస్త్ర ఆధారాల ప్రకారం…. సూర్యగ్రహణ సమయంలో రాహువు ప్రభావం అత్యధికంగా ఉంటుంది. నవగ్రహాలలో రాహువును క్రూరమైన, ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. మానసిక అలజడులు, గందరగోళం మరియు అనుకోని ప్రమాదాలకు రాహు ప్రభావమే కారణమని పండితులు చెప్తారు. గ్రహణ సమయంలో సూర్యకాంతిపై రాహు నీడ పడటం వల్ల చుట్టూ ఉన్న వాతావరణం, ప్రకృతి అపవిత్రమవుతాయని విశ్వసిస్తారు.

ఈ సమయంలో ప్రతికూల శక్తులు ప్రబలి, తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే గ్రహణం పట్టే సమయం నుంచి వీడే వరకు దైవ పూజలు నిలిపివేయడం, ఆహారం తీసుకోకపోవడం, శుభకార్యాలు చేయకపోవడం వంటి నియమాలను పాటిస్తారు. గ్రహణం వీడిన తర్వాత శరీరంపై ఉన్న ఆ ప్రతికూల శక్తి తీవ్రతను తొలగించుకుని, దేహాన్ని శుద్ధి చేసుకోవడానికే శాస్త్రాలు స్నానాన్ని తప్పనిసరి చేశాయి.

పూజలు ఎందుకు చేయాలి….?

గ్రహణ మోక్షానంతరం స్నానం పూర్తి చేసుకుని, పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి దానాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంపాకం (ఆహార ధాన్యాలు), వస్త్రాలు, పండ్లు లేదా యథాశక్తి దక్షిణను దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి.

మనదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుందా?

ఆగస్టు 12, 2026(ఇవాళ)న సంభవించే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. మన దేశంలో ఈ గ్రహణం దృశ్యమానం కాకపోవడం వల్ల ఇక్కడ సూతక కాలం కానీ, గ్రహణ నియమాలు కానీ వర్తించవని పంచాంగ కర్తలు స్పష్టం చేస్తున్నారు. నేడు శ్రావణ అమావాస్య (హరియాళీ అమావాస్య) కావడంతో ఎలాంటి భయాందోళనలు లేకుండా సాధారణంగా అమావాస్య నాడు చేసుకునే పితృ తర్పణాలు, పూజలు, దానధర్మాలు మరియు స్నానాలు ఎప్పటిలాగే నిరభ్యంతరంగా నెరవేర్చుకోవచ్చు.

గ్రహణం ముగిసిన తర్వాత పూజ ఎందుకు చేస్తారు: గ్రహణం ముగిసిన తరువాత, స్నానం చేసిన తర్వాత భగవంతుడిని ధ్యానం చేయడం మరియు ఆరాధించడం శుభప్రదమైనదిగా భావిస్తారు. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత చాలా మంది సూర్య దేవుడికి నీరు సమర్పిస్తారు మరియు సూర్య మంత్రాలను పఠిస్తారు. ఆ విధంగా చేయడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది మరియు ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుందని విశ్వసించబడుతుంది. వాతావరణం యొక్క ప్రతికూల శక్తి తొలగించబడుతుంది.

గ్రహణం ముగిసిన తర్వాత దానం యొక్క ప్రాముఖ్యత: గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసిన తర్వాత దానం చేయడం యొక్క ప్రాముఖ్యత కూడా శాస్త్రాలలో వివరించబడింది. గ్రహణం ముగిసిన తరువాత, అవసరమైన వ్యక్తికి ఆహారం, బట్టలు, పండ్లు లేదా దక్షిణను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఆగస్టు 12 గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా: లేదు, ఆగస్టు 12, 2026 సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. భారతదేశంలో దృశ్యమానత లేకపోవడం వల్ల, దాని సూతక్ కాలం మరియు నియమాలు కూడా చెల్లుబాటు కావు. ఈ గ్రహణం హరియాలి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య నాడు జరుగుతుంది. భారతదేశంలో గ్రహణం యొక్క ప్రభావం లేకపోవడం వల్ల, స్నానం, దాతృత్వం మరియు పూర్వీకుల పనులు అమావాస్య తేదీన ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయవచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe