కార్తీక మాసం అంటే ఎంతో పుణ్యం ఉన్న నెల. ఈ నెలలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో పూజలు, అభిషేకాలు, వ్రతాలు ఇలా ఎవరికి నచ్చినవి వారు చేస్తూ, ఎవరికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. కార్తీక మాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
కార్తీక మాసం 2025

ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ 22న ప్రారంభమైంది. నవంబర్ 20 వరకు కార్తీకమాసం కొనసాగుతుంది. కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. ఈ ఏడాది మొదటి సోమవారం అక్టోబర్ 27న, రెండవ సోమవారం నవంబర్ 3న, మూడవ సోమవారం నవంబర్ 10న, నాలుగవ సోమవారం నవంబర్ 17న వచ్చాయి. ఈ కార్తీకమాసంలో ఆకాశదీపం వెలిగిస్తారు. అసలు కార్తీకమాసంలో ఎందుకు ఆకాశదీపాన్ని వెలిగిస్తారు? దీని మహత్యం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ఆకాశదీపం
కార్తీకమాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఆకాశదీపం వేలాడదీస్తారు. ఒక చిన్న ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. దాదాపు ప్రతి శివాలయంలో దీనిని మనం చూడొచ్చు. దేవాలయానికి వెళ్లిన భక్తులు అందరూ ఆకాశదీపాన్ని చూసి నమస్కరిస్తారు.
పితృదేవతలకు మార్గం
ఆకాశదీపం పితృదేవతలకు మార్గం చూపుతుందని అంటారు. వారికి దారి చూపడం కోసం ఇలా కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో కూడా చెప్పబడింది. ఈ దీపాన్ని చూసి పితృ దేవతల్ని స్మరిస్తే కూడా మంచి జరుగుతుంది. అలాగే ఆకాశ దీపం కాంతిలో ఉన్న ప్రాంతమంతా శివయ్య కాపాడతాడని నమ్ముతారు.
శివ కేశవుల తేజస్సు
కొంతమంది ఇళ్లల్లో కూడా ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు. పితృదేవతలకు త్రోవ కనిపించాలనే ఉద్దేశ్యంతో కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని కడతారు. పితృదేవతలు ఆకాశమార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తారట. అందుకనే ఆ సమయంలో వారికి త్రోవ సరిగా కనపడటానికి దేవాలయాల్లో ఆకాశదీపాన్ని పెడతారు.
{{/usCountry}}కొంతమంది ఇళ్లల్లో కూడా ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఒక కర్ర కట్టి దానికి దీపాన్ని తగిలిస్తారు. పితృదేవతలకు త్రోవ కనిపించాలనే ఉద్దేశ్యంతో కార్తీకమాసంలో ఆకాశదీపాన్ని కడతారు. పితృదేవతలు ఆకాశమార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తారట. అందుకనే ఆ సమయంలో వారికి త్రోవ సరిగా కనపడటానికి దేవాలయాల్లో ఆకాశదీపాన్ని పెడతారు.
{{/usCountry}}ఈ దీపం శివ కేశవుల తేజస్సును జగత్తుకి అందిస్తుందని నమ్ముతారు. శివకేశవులు శక్తితో ఆకాశదీపం ధ్వజస్తంభం పై నుంచి మొత్తం భూమంతటికి వెలుతురును అందిస్తారని, అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయని అంటారు.
ఆకాశదీపాన్ని వెలిగించేటప్పుడు లేదా చూసి నమస్కరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి: “దామోదర మావాహయామి త్రయంబక మావాహయామి”