శని దేవుడితో జులై 27 నుంచి 138 రోజులు సూపర్ టైమ్.. ఈ రాశులవారికి ఒక వరం!
జ్యోతిష్యంలో శని దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. జులై 27 నుంచి కొన్ని రాశులవారికి అదృష్టాన్ని అందించోతున్నాడు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలలో శని దేవుడు ధర్మమూర్తిగా ప్రసిద్ధి చెందాడు. ఈ శని దేవుడు ఒకరి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇవ్వగలడు. శని దేవుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ఉంటాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని జులై 27వ తేదీన తిరోగమనంలో ఉంటాడు. సాధారణంగా గ్రహాలు తిరోగమనంలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాయి. జులైలో వక్రగతిలోకి వెళ్లే శని, సుమారు 138 రోజుల పాటు అలాగే ఉంటాడు.

శని తిరోగమనంలో వెళ్లినప్పుడు, దాని ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న అన్ని రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. వాటిలో కొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శని తిరోగమన కాలంలో 4 రాశుల వారు తమ ఆర్థిక పరిస్థితిలో మంచి వృద్ధిని చూస్తారు. దీని కారణంగా ఈ రాశుల వారి రుణ సమస్య తీరబోతోంది.
వృషభ రాశి
వృషభ రాశిలోని 11వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఒక వరం. ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి వస్తుంది. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెరుగుదల లభించవచ్చు. కొంతమందికి కోరుకున్న బదిలీ కూడా లభించవచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారి 10వ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటుంది. దీనివల్ల ఈ రాశి వారి అదృష్టం మెరుగుపడుతుంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. వంశపారంపర్య ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల నుండి మీకు మంచి లాభాలు లభిస్తాయి. దీర్ఘకాలిక కుటుంబ సమస్యలు అంతమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల అప్పుల సమస్యలు తీరిపోతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలోని 5వ ఇంట్లో శని వక్రగతిలో ఉంటుంది. దీనివల్ల ఈ రాశివారి ఒత్తిడి తగ్గుతుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు చూసే కంపెనీలలో పనిచేసే వారికి ఈ కాలంలో కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఆదాయం పెరుగుతుంది.
కుంభ రాశి
కుంభ రాశిలోని రెండో ఇంట్లో శని తిరోగమనంలో ఉంటుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. మీరు చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు. అప్పులు తీరిపోతాయి. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో వారి అద్భుతమైన పనితీరు కారణంగా పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందవచ్చు. వృత్తిలో మంచి పురోగతికి అవకాశాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


