తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సూపర్ న్యూస్ అందించింది. రాబోయే పండుగలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నుంచి రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలకు (నార్త్ ఈస్ట్) మూడు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది. గతంలో 'స్పెషల్ ట్రైన్స్'గా నడిచిన వీటిని ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ఈ కొత్త రైలు సర్వీసులు జూలై నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల సమయాలు, రూట్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
గత కొంతకాలంగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లలో హైదరాబాద్ - జైపూర్, చర్లపల్లి - అగర్తలా, కాచిగూడ - శ్రీ గంగానగర్ వీక్లీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి.
హైదరాబాద్ - జైపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్లే పర్యాటకులు, వ్యాపారస్తులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. జూలై 24 నుంచి సర్వీస్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ టూ జైపూర్ (17079) ప్రతి శుక్రవారం రాత్రి 7:50 గంటలకు హైదరాబాద్లో బయలుదేరుతుంది. జైపూర్ టూ హైదరాబాద్ (17080) జూలై 26 నుంచి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జైపూర్లో తిరుగు ప్రయాణం అవుతుంది.
ప్రధాన స్టాపింగ్లు: సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్, అకోలా, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, అజ్మీర్.
చర్లపల్లి - అగర్తలా వీక్లీ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు ఈ రైలు నడవనుంది. జూలై 27 నుంచి సర్వీస్ ప్రారంభం కానుంది. చర్లపల్లి టూ అగర్తలా (17031) ప్రతి సోమవారం సాయంత్రం 4:20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అగర్తలా టూ చర్లపల్లి (17032) జూలై 31 నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
ప్రధాన స్టాపింగ్లు: ఈ రైలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం మీదుగా త్రిపుర చేరుకుంటుంది. విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, ఖరగ్పూర్, గువహాటి, న్యూ హాఫ్లాంగ్ వంటి కీలక నగరాల్లో ఈ రైలు ఆగనుంది.
కాచిగూడ - శ్రీ గంగానగర్ వీక్లీ ఎక్స్ప్రెస్
{{/usCountry}}ప్రధాన స్టాపింగ్లు: ఈ రైలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం మీదుగా త్రిపుర చేరుకుంటుంది. విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, ఖరగ్పూర్, గువహాటి, న్యూ హాఫ్లాంగ్ వంటి కీలక నగరాల్లో ఈ రైలు ఆగనుంది.
కాచిగూడ - శ్రీ గంగానగర్ వీక్లీ ఎక్స్ప్రెస్
{{/usCountry}}తెలంగాణ నుంచి రాజస్థాన్లోని సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రైలు ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. జూలై 25 నుంచి సర్వీస్ ప్రారంభం అవుతుంది. కాచిగూడ టూ శ్రీ గంగానగర్ (17061) ప్రతి శనివారం రాత్రి 10:00 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. శ్రీ గంగానగర్ టూ కాచిగూడ (17062) జూలై 28 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 6:55 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
ప్రధాన స్టాపింగ్లు: మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, భోపాల్, జైపూర్, బికానెర్, సూరత్గఢ్.
సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్లపై రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి స్టేషన్ను రైల్వే శాఖ అభివృద్ధి చేసింది. నార్త్ ఈస్ట్ వెళ్లే ప్రయాణికులు నగరం వెలుపల నుంచే ఈ సేవలను సులువుగా పొందవచ్చు. ఈ రెగ్యులర్ రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్లు త్వరలోనే ఐఆర్సీటీసీ వెబ్సైట్, కౌంటర్లలో ప్రారంభం కానున్నాయి.