Telangana: గ్యాస్ సిలిండర్ల దందాపై ఉక్కుపాదం - ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశారంటే..?
గ్యాస్ కొరత నేపథ్యంలో జోరుగా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. మరోవైపు పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు పోలీసులు ఈ దందాపై నిఘా పెడుతున్నారు.
గ్యాస్ కొరత నేపథ్యంలో పలువురు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు. దొరికిందే అదునుగా చూసి… భారీ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఫలితంగా మార్కెట్ లో గ్యాస్ కొరతతో ఇబ్బందిపడుతున్న ప్రజలు… బ్లాక్ మార్కెట్లలోని రేట్లను చూసి భయపడిపోతున్నారు.

అక్రమంగా సాగుతున్న సిలిండర్ల దందాపై ప్రభుత్వం నిఘా పెట్టింది. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ… రాష్ట్రంలోని గ్యాస్ కొరత పరిస్థితులపై ఆరా తీస్తోంది. అయితే బ్లాక్ మార్కెట్ దందాకు చెక్ పెట్టేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు చేసేలా ఆదేశాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖతో పాటు పోలీస్ శాఖ కూడా చాలా చోట్ల సోదాలు చేపట్టింది.
3700 సిలిండర్లు సీజ్…
మార్చి 12వ తేదీ నుంచి ఇవాళ్టి(ఏప్రిల్ 3) వరకు రాష్ట్రవ్యాప్తంగా 3700 సిలిండర్లను సీజ్ చేసినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సీజ్ చేసిన వాటిలో 70 చిన్న సిలిండర్లు ఉన్నాయి. పట్టుబడిన వాటి విలువ రూ. 1.10 కోట్లు ఉంటుంది. మొత్తం 216 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎల్పీజీ సిలిండర్ల హోర్డింగ్ లేదా బ్లాక్ మార్కెటింగ్ ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. అనధికార నిల్వ లేదా అక్రమంగా ఎల్పిజీ సిలిండర్లను తిరిగి విక్రయించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగానూ గ్యాస్ సరఫరాపై నిఘా కొనసాగుతోంది. అక్రమంగా నిల్వలు చేస్తే…కేసులు నమోదు చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 1.30 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ డేస్లో 2.15 లక్షల బుకింగ్స్ ఉంటాయి. అయితే యుద్ధానికి ముందు రోజూవారీ పెండింగ్ 3.50 లక్షల ఉండేవి. ఇందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా జరిగేవి. మిగిలినవి మరుసటి రోజు చేస్తుండేవారు. ఇప్పుడు డెలివరీ కావాల్సినవి 15 లక్షలు ఉన్నాయి.
సిలిండర్ల డెలివరీ వేగంగా జరిగితే ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నిజానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలు మెుదలై.. సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరత అంటూ ప్రచారం అవ్వడంతో బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో సిస్టమ్ లాక్ పద్ధతిని అమలులోకి తెచ్చింది కేంద్రం. బుకింగ్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉంటే... 25 రోజులు, డబుల్ సిలిండర్లు ఉంటే 35 రోజుల లాక్ సిస్టమ్ అమలు చేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

