అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం వివాదానికి దారితీసింది. బ్లాక్ టీషర్ట్ ధరించి.. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై తాతా మధు బూతులు తిట్టారని, పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతోపాటుగా మరికొందరు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ శాసనసభ స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి పొన్నం అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని, తాతా మధు వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి సంఘీభావం ప్రకటించినట్టుగా చెప్పారు. స్పీకర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు.. రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని పొన్నం మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
'ఒక అట్టడుగు వర్గాల బిడ్డ, దళిత బిడ్డ శాసనసభ స్పీకర్గా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుండా ఉంటారు. కానీ ఆయన పార్టీకి చెందిన నాయకులు మాత్రం బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఆయనను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా మాట్లాడినా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. శాసనసభ, స్పీకర్ పదవి పట్ల కనీస గౌరవం లేని విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలి.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
కేసీఆర్.. అమ్మకు, ఆడబిడ్డకు, దళితులకు, మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. దళితుడు, స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అత్యంత అసభ్యకరంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత సీఎం నుండి దళితుడికి మూడెకరాల భూమి దాకా.. అన్నింటా దళితులను నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. అమ్మ అంటే కనీస గౌరవం లేకుండా, దళితులను తిట్టిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దళితులు, మహిళలు కచ్చితంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సొంత కూతురు, అల్లుడి ఫోన్ ను ట్యాప్ చేసిన నీచుల నుండి ఇంతకు మించి ఏం ఆశించగలం అని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}కేసీఆర్.. అమ్మకు, ఆడబిడ్డకు, దళితులకు, మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. దళితుడు, స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అత్యంత అసభ్యకరంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత సీఎం నుండి దళితుడికి మూడెకరాల భూమి దాకా.. అన్నింటా దళితులను నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. అమ్మ అంటే కనీస గౌరవం లేకుండా, దళితులను తిట్టిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దళితులు, మహిళలు కచ్చితంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సొంత కూతురు, అల్లుడి ఫోన్ ను ట్యాప్ చేసిన నీచుల నుండి ఇంతకు మించి ఏం ఆశించగలం అని వ్యాఖ్యానించారు.
{{/usCountry}}