Indiramma Towers Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి మరియు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్లైన్ను ప్రభుత్వం శనివారం ప్రారంభించింది.

హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఈ హెల్ప్లైన్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రజలు ఎలాంటి అపోహలు… గందరగోళానికి గురికాకుండా, దళారులు లేదా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా అధికారిక సమాచారం తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
హెల్ప్లైన్ నెంబర్ వివరాలు….
- ప్రజలు తమ సందేహాల కోసం 040-24603572 నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలు పొందొచ్చు.
- దరఖాస్తుదారుల సౌకర్యార్థం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో సమాచారం అందిస్తారు.
తొలి విడతలో 7,680 ఇళ్ల నిర్మాణం
క్యూర్ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అందులో భాగంగా తొలి విడత కింద 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నామని…. దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్ మరియు వాట్సాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
యూపీఐ ద్వారా పేమెంట్…
దరఖాస్తు సమయంలో రూ. 10,000 ఇఎండి మొత్తాన్ని యూపీఐ (UPI) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ లాటరీలో ఇల్లు రాకపోతే…. ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుల ఖాతాకే నేరుగా తిరిగి జమ చేస్తారు. అందుకే పరిశీలన, కేటాయింపు, వాపసు ప్రక్రియ ముగిసే వరకు మీసేవ రశీదు, చెల్లింపు రశీదు, దరఖాస్తు సంఖ్య మరియు మొబైల్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.
{{/usCountry}}దరఖాస్తు సమయంలో రూ. 10,000 ఇఎండి మొత్తాన్ని యూపీఐ (UPI) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ లాటరీలో ఇల్లు రాకపోతే…. ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుల ఖాతాకే నేరుగా తిరిగి జమ చేస్తారు. అందుకే పరిశీలన, కేటాయింపు, వాపసు ప్రక్రియ ముగిసే వరకు మీసేవ రశీదు, చెల్లింపు రశీదు, దరఖాస్తు సంఖ్య మరియు మొబైల్ నంబర్ను భద్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.
{{/usCountry}}దరఖాస్తు సమయంలో కేవలం ఆధార్ నెంబర్ తెలియజేస్తే సరిపోతుందని, కుల, జీతభత్యాల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. లాటరీలో ఇల్లు ఎంపికైన తర్వాత మాత్రమే ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి సమగ్ర ధృవీకరణ పూర్తి చేస్తారు. దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6.00 లక్షల లోపు ఉండాలి.
- దరఖాస్తుదారు క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివాసం ఉంటుండాలి.
- దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఓఆర్ఆర్ (ORR) లేదా క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు.
- ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు
- ఈ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ప్రతి ఫ్లాట్ దాదాపు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ (1BHK) సౌకర్యాలతో ఉంటుంది.
- మార్కెట్లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటుంది.
- రూ. 5 లక్షల సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అన్డివైడెడ్ షేర్ (UDS) కింద 20 నుంచి 25 గజాల స్థలాన్ని లబ్ధిదారుని పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. దీంతో లబ్ధిదారుడు కేవలం రూ. 6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.