తెలంగాణలో కొత్త పెన్షన్ కోసం చూస్తున్నారా? ఏమేం పత్రాలు మీ దగ్గర ఉండాలి?
తెలంగాణలో జూన్ 2 నుంచి కొత్తగా రెండు లక్షల చేయూత పెన్షన్లు పంపిణీ చేయనుంది సర్కార్. దీంతో చాలా మంది గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు కోసం అర్హత పత్రాలను ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో కొందరికి గందరగోళం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి చేయూత పెన్షన్ పథకం తీసుకువస్తుంది. దీనిద్వారా కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అర్హులైన వారు ఎలాంటి ఆలస్యం లేకుండా వివిధ పత్రాలను రెడీ చేసుకోవాలి. మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు లేవు. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో డాక్యుమెంట్లను ఇస్తున్నారు. అయితే ఈ పెన్షన్ల కోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకోండి.

తెలంగాణలో కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింది పత్రాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. మీరు దరఖాస్తు చేసుకునే పెన్షన్ రకాన్ని బట్టి (వృద్ధాప్యం, వితంతువు, దివ్యాంగులు, గీత కార్మికులు మొదలైనవి) కావాల్సిన పత్రాలు కొద్దిగా మారుతుంటాయి.
సాధారణ పత్రాలు
అందరికీ కావలసిన సాధారణ పత్రాలు.. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి, తెల్ల రేషన్ కార్డు నకలు వయస్సు ధృవీకరణ పత్రాలు(ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కోసం), ఓటర్ ఐడీ కార్డ్ లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల సర్టిఫికేట్ (SSC Memo), బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్థానికత/నివాస ధృవీకరణ(ఓటర్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు) ఉండాలి.
పెన్షన్ రకాన్ని బట్టి అదనంగా కావాల్సిన పత్రాలు
మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో, దానికి సంబంధించిన ఈ క్రింది సర్టిఫికేట్లు జత చేయాలి. వితంతు పెన్షన్కి అప్లై చేస్తే పైన చెప్పిన డాక్యుమెంట్స్తోపాటుగా భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగుల పెన్షన్కు కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరం సర్టిఫికేట్ ఉండాలి. నేత కార్మికులు చేనేత కార్మిక సంఘంలో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లు పత్రం కావాలి. గీత కార్మికులకు గీత కార్మిక సహకార సంఘంలో సభ్యత్వ సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళలైతే.. వివాహం కాకుండా ఒంటరిగా ఉంటున్నట్లు లేదా భర్త వదిలేసినట్లు స్థానిక తహశీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ కావాలి. బిడీ కార్మికులు గుర్తింపు కార్డ్(PF Account లేదా జీవనోపాధి సర్టిఫికేట్), ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ART) కేంద్రం జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
పైన పేర్కొన్న పత్రాలతో పాటు పూర్తి చేసిన పెన్షన్ దరఖాస్తు ఫారమ్ను తీసుకుని సమీపంలోని మీసేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో (సర్పంచ్/సెక్రటరీ) లేదా మున్సిపల్ వార్డు ఆఫీసులో దరఖాస్తును సమర్పించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


