మొంథా తుపాను వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లోని వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి… కీలక సూచనలు చేశారు.
అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.
ఇక ఇవాళ వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కానీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.
“రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నాను, తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైవేలోనూ ఇబ్బందులు:
మరోవైపు వరంగల్-హైదరాబాద్ హైవేలోనూ వరద ఇబ్బందులు ఉన్నాయి. రాఘవాపూర్ దగ్గర హైవే జలమయమైంది. నిన్న కొన్ని గంటల పాటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రోడ్డు డివైడర్ను కూల్చి వరద నీటిని మళ్లీంచారు. ఇప్పుడిప్పుడే రాకపోకలు కొనసాగుతున్నాయి.
{{/usCountry}}మరోవైపు వరంగల్-హైదరాబాద్ హైవేలోనూ వరద ఇబ్బందులు ఉన్నాయి. రాఘవాపూర్ దగ్గర హైవే జలమయమైంది. నిన్న కొన్ని గంటల పాటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రోడ్డు డివైడర్ను కూల్చి వరద నీటిని మళ్లీంచారు. ఇప్పుడిప్పుడే రాకపోకలు కొనసాగుతున్నాయి.
{{/usCountry}}